బీజేపీ నేతను వెంటాడి కాల్చేశారు( వీడియో)
పాట్నా: బీహార్ లో రాజకీయ కక్షల కారణంగా బీజేపీ నాయకుడిని అతిదారుణంగా వెంటాడి కాల్చి చంపేశారు. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నా ప్రత్యర్థులు తమ పని ముగించుకుని వెళ్లిపోయారు. బీహార్ రాజధాని పాట్నా నగరంలోనే ఈ దారుణం జరిగింది.
పాట్నాలో అవినాష్ కుమార్ అనే బీజేపీ నాయకుడు నివాసం ఉంటున్నారు. ఈయన ఎప్పటిలాగే గురువారం ఉదయం వాకింగ్ కు బయలుదేరాడు. మార్గం మద్యలో ముగ్గురు దుండగులు ఆయన మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారు.
ఆ సందర్బంలో అవినాష్ కుమార్ తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే నిందితులు వెంటాడి ఒక దేవాలయం సమీపంలో తుపాకులతో కాల్పులు జరిపారు. బుల్లెట్ లు దూసుకు వెళ్లడంతో అవినాష్ కుమార్ అక్కడే ప్రాణాలు వదిలి పెట్టాడు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని దేవాలయం దగ్గర ఎర్పాటు చేసిన సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. అవినాష్ కుమార్ హత్యకు గురైనాడని తెలుసుకున్న బీహార్ బీజేపీ నాయకులు రోడ్ల మీదకు వచ్చారు.
రోడ్ల మీద టైర్లు వేసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ సమావేశంలో పాల్గోనే సమయంలోనే అవినాష్ కుమార్ హత్యకు గురైనాడు. బీహార్ శాసన సభ సమావేశాలలో బీజేపీ ఎంఎల్ఏలు అధికార పార్టీ నాయకులను నిలదీశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ కక్షలతో పలు హత్యలు జరుగుతున్నాయి.