రివర్స్ గేమ్ తో లీడర్స్ కు షాక్, ముళ్లును మళ్లుతోనే తీస్తాము, ఆపరేష్ హస్తంతో షాక్ !
బెంగళూరు/ న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి ఆపరేషన్ హస్తం ముప్పు పొంచి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఆపరేషన్ హస్తం పేరుతో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను లాక్కోవాలని ప్రయత్నాలు జరుగుతున్న మాటలు నిజం అనే రీతిలో ప్రచారం జరగుతోంది.
ఇదే విషయంలో కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ బహిరంగ ప్రకటన చేశారని చెబుతున్నారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని, బీజేపీ తీరుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విసిగిపోయారని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు అని, వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, దీనిపై ఇప్పటికే మా పార్టీ నాయకులు క్లారిటీ ఇచ్చారని, అన్ని విషయాలు త్వరలో చెబుతామని కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వర్ చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చేవారు కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మాలని, గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు అని హోమ్ మంత్రి డాక్టర్ పరమేశ్వర్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన వారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే సమాచారం ఉందని, కానీ వారికి ఫస్ట్ బెంచ్ రాలేదు అని. మీరు చేసిన తప్పును సరిదిద్దుకుంటే మళ్లీ రావచ్చు అని హింట్ ఇచ్చామని హోమ్ మంత్రి పరమేశ్వర్ అన్నారు. అంతేకాదు కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు నాతో చర్చించారు. వారి పేర్లు బహిరంగంగా చెప్పలేమని హోమ్ మంత్రి పరమేశ్వర్ అన్నారు.

ఏది పడితే అది చేస్తాం అని మేము చెప్పమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఒకవైపు, రాజకీయం మరో వైపు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. ఈసారి మేము అధికారంలో ఉన్నామని, మా లక్ష్యం మాకు ఉంటుందని, కానీ ఎవరు విజేత అని ప్రజలు నిర్ణయిస్తారని పరమేశ్వర్ వివరించారు. కాంట్రాక్టర్తో బేరసారాలు కుదుర్చుకున్నారని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి చేసిన ఆరోపణపై పరమేశ్వర్ మండిపడ్డారు

మాజీ సీఎం కుమారస్వామి ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, వ్యాఖ్యానించే హక్కు ఆయనకు ఉందని, అయితే ఆరోపణ సరైవని కాదు అని సరైన ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదని, కుమారస్వామి రెండు సార్లు సీఎం అయ్యారు, వాళ్లు మాట్లాడితే జనం గమనిస్తారు. ఆయన చెప్పే దాంట్లో నిజం ఉందని ప్రజలు నమ్ముతారు అని వాళ్లు అనుకుంటున్నారని, అయితే అలాంటి వ్యాఖ్యలు ఆయనకే మంచిదికాదని హోమ్ మంత్రి పరమేశ్వర్ మండిపడ్డారు.
ఇంత అవినీతి ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని కుమారస్వామి చేసిన ప్రకటనపై నేను మాట్లాడను. కానీ, ప్రజలకు మాట ఇచ్చాం. సుపరిపాలన ఇస్తామని చెప్పాము, అందుకు తగ్గట్టుగానే సీఎం సిద్దరామయ్యతో పాటు కర్ణాటక మంత్రులు పనిచేస్తున్నాని, నిందించడం కంటే ఆరోపణలు చేసే ముందు అందుకు తగ్గట్లు ఆధారాలు సేకరించాలని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ప్రతిపక్ష పార్టీల నాయకులకు సూచించారు.
-
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications