మాజీ సీఎంకు షాక్, రివర్స్ ఆపరేషన్ షురు, దెబ్బకు దెబ్బ తియ్యాలి, కులం ఓట్లతో !
బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పార్టీలు మారే నాయకుల జోరు ఎక్కువ అవుతోంది. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ నాయకులు రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన వెంటనే హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం సీటు ఇచ్చేశారు. హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బసవరాజ్ మలకారి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ వేశారు.

బసవరాజ్ తో నామినేషన్ వితడ్రా చేయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. అయితే బసవరాజ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాట వినలేదు. ఇదే సమయంలో రంగంలోకి దిగిన బీజేపీ నాయకులు బసవరాజ్ ను బీజేపీలోకి చేర్చుకోవడంలో విజయం సాధించారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో బీజేపీలో చేరిన బసవరాజ్ బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బసవరాజ్ ను బీజేపీలో చేర్చుకున్న నాయకులు లింగాయత్ ఓట్లు చీల్చి జగదీష్ శెట్టర్ ను దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అమ్రత్ దేశాయ్ రాజీ చర్చలు మొదలుపెట్టి బసవరాజ్ ను బీజేపీలో చేర్చుకున్నారు.
మరో వైపు హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఓ మైనారిటీ నాయకుడు తాను పోటీలోనే ఉంటానని, జగదీష్ శెట్టర్ కు మద్దతు ప్రకటించమని తేల్చి చెప్పారు. బీజేపీ నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకున్న ఆ పార్టీ నాయకులను దెబ్బ కొట్టాలని ఇప్పుడు బీజేపీ నాయకులు రివర్స్ ఆపరేషన్ కమలను తెర మీదకు తీసుకురావడంతో కర్ణాటకలోని పలు నియోజక వర్గాల్లో అసెంబ్లీ ఎన్నిల పోరు రసవత్తరంగా మారిపోయింది.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications