Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ అంటే భారతీయ ఝగ్డా పార్టీ; బీజేపీ కుట్రలకు దూరంగా ఉండండి: అఖిలేష్ యాదవ్

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని అధికార పార్టీ అబద్ధాలను వ్యాప్తి చేస్తుందని, వర్గాల మధ్య ఘర్షణ మరియు విభేదాలకు కారణమవుతుందని ఆరోపించారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.

భారతీయ ఝగ్డా పార్టీగా బీజేపీ పేరు మార్చుకోవాలి: అఖిలేష్ యాదవ్

భారతీయ ఝగ్డా పార్టీగా బీజేపీ పేరు మార్చుకోవాలి: అఖిలేష్ యాదవ్


బీజేపీ తన పేరును భారతీయ ఝగ్డా పార్టీగా మార్చుకోవాలన్నారు . సానుభూతి పొందేందుకు వారు ఏమైనా చేయగలరని మండిపడ్డారు . వారు ఎప్పుడూ అబద్ధాలు చెబుతారని, ప్రజలను మోసం చేయడానికి మరియు కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారని అఖిలేష్ యాదవ్ యుపి అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేస్తున్న కర్హల్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ అన్నారు.

 ఎస్పీనే యూపీ ప్రజలు గెలిపిస్తారు : అఖిలేష్ యాదవ్

ఎస్పీనే యూపీ ప్రజలు గెలిపిస్తారు : అఖిలేష్ యాదవ్


సుదీర్ఘకాలంగా సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న కర్హల్‌లో అఖిలేష్ యాదవ్‌తో పాటు అతని తండ్రి మరియు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్హల్ ప్రజలు మరోసారి "సైకిల్" (ఎస్పీ ఎన్నికల గుర్తు)కు ఓటు వేస్తారని, యూపీలో పార్టీకి భారీ విజయాన్ని అందిస్తారని తాను విశ్వసిస్తానని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.

బీజేపీ కుట్రలు, కుతంత్రాలకు దూరంగా ఉండండి: అఖిలేష్ యాదవ్

బీజేపీ కుట్రలు, కుతంత్రాలకు దూరంగా ఉండండి: అఖిలేష్ యాదవ్

కాషాయ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేసి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగాలు, జీవనోపాధిని బీజేపీ లాక్కుందని అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు . బీజేపీ కుట్రలు, కుతంత్రాలకు దూరంగా ఉండండి అని అఖిలేష్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు . హోం మంత్రి అమిత్ షాను హేళన చేస్తూ, అఖిలేష్ యాదవ్, సీనియర్ బిజెపి నాయకుడు కూడా ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, అయితే వేదిక వద్ద ఖాళీ కుర్చీలతో స్వాగతం పలికారని ఎద్దేవా చేశారు.

ములాయం సింగ్ యాదవ్ ప్రచారం చేస్తారనే అమిత్ షా

ములాయం సింగ్ యాదవ్ ప్రచారం చేస్తారనే అమిత్ షా

ఈరోజు కర్హల్‌లో ములాయం సింగ్ కూడా ప్రచారం చేస్తారని తెలుసుకున్న షా పారిపోయారని కూడా ఆయన పేర్కొన్నారు. యుపిని కాపాడడానికి సమాజ్వాదీ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. సోషలిస్ట్ సూత్రాలపై పని చేస్తానని సమాజ్వాది పార్టీ చీఫ్ హామీ ఇచ్చారు.మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు మెరుగైన సౌకర్యాలు, గిట్టుబాటు ధరలు కల్పించడం ద్వారా ప్రజల ఆశలను ఎస్పీ నెరవేరుస్తుందని ములాయం సింగ్ అన్నారు.

ఏది చెప్పినా కచ్చితంగా చేసి తీరుతాం

ఏది చెప్పినా కచ్చితంగా చేసి తీరుతాం

సమాజ్‌వాదీ పార్టీ ఏది చెప్పినా కచ్చితంగా చేసి తీరుతుందని గతంలోనూ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చామని ఆయన వెల్లడించారు. తన ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాన్ని అభినందిస్తూ, యూపీలో ఎస్పీని గెలిపించి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ములాయం సింగ్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+