సొంత ఎమ్మెల్యేలకు సీఎం ఫైన్, అవినీతి ఎస్సై ఇంట్లో...
జైపూర్/భోపాల్: రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు కోపమొచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ శాసన సభా పక్ష సమావేసానికి ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. వారికి రూ.500 జరిమానా విధించారు. దీంతో పదిహేను మంది బీజేపీ ఎమ్మెల్యేలు జరిమానా చెల్లించవలసి వచ్చింది.
సమావేశాలకు మరోసారి ఆలస్యంగా వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఆమె సభ్యులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి జరిమానాతో మొదట విస్తుపోయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, సమయపాలన విలువ తెలిపేందుకే తమ నేత ఇలా చేశారని వ్యాఖ్యానించారు.

అవినీతి ఎస్ఐ ఇంట్లో అంగన్వాడీ భవనం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అవినీతిపరులపై కొరడా ఝుళిపించారు. నిబంధనలు ఉల్లంఘించి, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనూ ప్రజోపయోగానికి ఆయన పెద్ద పీట వేశారు.
ఒక కేసులో అరవింద్ అనే సబ్ ఇన్స్పెక్టర్ అవినీతిపరుడుగా తేలడంతో అతని ఇంటి ఆవరణంలో ఒక అంగన్వాడీ భవనం, ఒక స్కూల్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఇలా అవినీతి పరుల ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజావసరాల కోసం వాటిని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications