Karnataka Polls : ఈసారి నామమాత్రంగా జేడీఎస్ ? బీజేపీ-కాంగ్రెస్ లో ఎవరికి లాభం ?

కర్నాటకలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొన్నట్లు పైకి కనిపిస్తున్నా.. ఓట్ల వాటా, ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం అసలు పోరు మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొంది. మరికొన్ని సీట్లలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ గా ఉంది. అలాగే బీజేపీ వర్సెస్ జేడీఎస్ పోరు మాత్రం చాలా తక్కువ సీట్లలో కనిపిస్తోంది.

2018 ఎన్నికల్లో పోలింగ్ జరిగిన 222 నియోజకవర్గాల్లో దాదాపుసగం స్ధానాలు అంటే 110 స్ధానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అలాగే ఈ రెండు పార్టీలు కలిపి దాదాపు 80 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించాయి. జేడీఎస్ ఎక్కడో దూరంగా నిలిచింది. ఉత్తర, కోస్తా కర్ణాటకలో జేడీఎస్ పాత్ర నామమాత్రమే. కానీ ఆ పార్టీకి అత్యధిక ఓట్లు దక్షిణ కర్ణాటక నుండి వచ్చాయి. 29 నియోజకవర్గాల్లోప్రధానంగా దక్షిణ కర్ణాటకలోని ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ఎన్నికల పోరు కాంగ్రెస్, జెడి(ఎస్) మధ్య జరిగింది. కేవలం తొమ్మిది నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ, జేడీ(ఎస్‌) మధ్య పోటీ నెలకొంది.

bjp or congress ? who will benefit with jd(s)s non-serious competition in karnataka polls ?

ఉత్తర, మధ్య కర్ణాటకలో బీజేపీని దెబ్బతీయడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే జేడీ(ఎస్) ఓట్లు పెరగడం కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టంగా మారబోతోంది.కాబట్టి కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ రావాలంటే, అది బీజేపీ ఓట్లను తగ్గించడానికి అధికార వ్యతిరేక సెంటిమెంట్‌లపై ఆధారపడటమే కాకుండా జేడీఎస్ ఓట్లను కూడా తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఈసారి జేడీఎస్ ప్రభావం నామమాత్రంగానే ఉండబోతోందన్న అంచనాల నేపథ్యంలో ఆ ఓట్లుఎవరికి బదిలీ అవుతాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

bjp or congress ? who will benefit with jd(s)s non-serious competition in karnataka polls ?

కాంగ్రెస్ కంటే తక్కువ ఓట్ల తేడాతో భాజపా ఎక్కువ సీట్లు కోల్పోతుందని గణాంకాలు చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ కంటే జేడీ(ఎస్) అభ్యర్థుల ఉనికి బీజేపీకే ఎక్కువగా ఉపయోగపడుతుందని రాజకీయ అనుభవం తెలియజేస్తోంది. అంటే వారి ఓట్లలో కోత కారణంగా బీజేపీ ఓడిపోవడం లేదు. కానీ, జేడీఎస్ వారి ఓట్లను తీసుకోవడం వల్ల కాంగ్రెస్ గెలుపు మార్జిన్ తగ్గుతోంది. తమకు పట్టు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై జేడీ(ఎస్) వ్యూహాలే ఇందుకు కారణం. ఈ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించే వరకు జేడీ(ఎస్) ఎదురుచూస్తోంది. ప్రకటన తర్వాత వచ్చే స్థానిక అసమ్మతిని సొమ్ము చేసుకునేలా అభ్యర్థులను ప్రకటిస్తోంది.

సాధారణంగా త్రిముఖ పోటీ ఉండే తొమ్మిది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో, 2019లో కాంగ్రెస్ ఓట్ల శాతం 12.5 శాతం తగ్గింది అలాగే జేడీఎస్ ఓట్ల శాతం 7.76 శాతం తగ్గింది. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు జేడీఎస్ కు ఓటు వేయడానికి నిరాకరించారు. దక్షిణ కర్ణాటకలో జేడీ(ఎస్) బలహీనపడితే, ఓటర్లు కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువగా ఓటేసే అవకాశం ఉందని చెప్పడానికి ఇది ఒక్కటే. జేడీ(ఎస్) లేకుండా కర్ణాటకలో సొంతంగా మెజారిటీ సాధించని బీజేపీ రాష్ట్రంలో ఆధిపత్య పార్టీగా అవతరించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+