బెంగాల్ బీజేపీలోకి 13 మంది నటులు, టీఎంసీ ఎంపీలకు ధీటుగా పనిచేస్తారని ధీమా
కోల్కతా : పార్లమెంట్ ఎన్నికలకు ముందు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సినీతారలు చేరిపోయారు. వారికి టిక్కెట్లు కేటాయించారు కూడా ఆ పార్టీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అయితే ఎన్నికల్లో మాత్రం టీఎంసీ కన్నా బీజేపీకి ఆశించిన కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల బీజేపీలో చేరికల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఒకరు కాదు ఇద్దరు కాదు 13 మంది టీవీ నటులు బీజేపీలో చేరారు. దీంతో రెండేళ్లలో బెంగాల్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలపై కమళదళం ఇప్పటినుంచే ఫోకస్ చేస్తున్నట్టు ఆ పార్టీ చర్యల ద్వారా అర్థమవుతుంది.
నటులతో కళ కళ ..
బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ టీవీ నటులను తీసుకొని ఢిల్లీ వచ్చారు. వారు బీజేపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. రిషి కౌశిక్, పార్నో మిత్రా, కంచనా, రుపాంజన, బిశ్వజిత్ గంగూలీ, దేబ్ రంజన్ నాగ్, అరిందన్ హల్దార్, మౌమిత గుప్తా, అనింద్య బెనర్జీ, సౌరవ్ చక్రవర్తి, రుపా భట్టాచార్య, అంజనా బసు, కౌశిక్ చక్రవర్తి కాషాయ కండువా కప్పుకున్నారు. వీరంతా బెంగాల్ టీవీ, సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బెంగాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టీవీ నటులు బీజేపీలో చేరడాన్ని స్వాగతించారు ఘోష్. ఇప్పటికే తమ పార్టీ నేతలపై దాడులు చేసి, భయాందోళనకు గురిచేస్తున్న తరుణంలో .. బీజేపీలో చేరేందుకు వారి చేసిన ధైర్యాన్ని కొనియాడారు.

అంతేకాదు వీరంతా బీజేపీ ఎంపీలు మిమి చక్రవర్తి, నుస్రత్ జహన్కు సమాధానం చెబుతారని పేర్కొన్నారు. అంతేకాదు బెంగాల్లో మరిన్ని చేరికలు కూడా ఉంటాయని సంకేతాలిచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే కసరత్తు మొదలైందని స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఎంసీ 22 ఎంపీ సీట్లు గెలుచుకోగా .. బీజేపీ 18 సీట్లు సాధించింది. దీంతో బెంగాల్లో ఆధిపత్య పోరు మొదలైంది. ఇటీవల జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో కార్యకర్తలు చనిపోయిన సంగతి తెలిసిందే.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications