నరేంద్ర మోడీ ఇంకేదో చేస్తారని: గుజరాత్లో బుల్లెట్ రైలు పని చేసింది!
ముంబై/అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. గుజరాత్లో సీట్లు తగ్గడానికి, రెండు రాష్ట్రాల్లో కమల వికాసానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో బుల్లెట్ రైలు మేజిక్ కూడా ఉందని అంటున్నారు.
సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న బీజేపీపై గుజరాత్లో వ్యతిరేకత ఉండటం సహజం. పైగా కాంగ్రెస్ పార్టీకి పలువురి అండ దొరికింది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ-అమిత్ షా జోడి గుజరాత్ను నెగ్గుకొచ్చింది. బీజేపీ విజయానికి దోహదం చేసిన వాడిలో బుల్లెట్ రైలు కూడా ఉందని అంటున్నారు.

బుల్లెట్ రైలు అభివృద్ధి
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ గెలుపు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల బీజేపీ కార్యాలయాల వలె మహారాష్ట్రలోని కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చారు. ఈ సమయంలో బీజేపీ ముంబై చీఫ్ ఆశిష్ షేలార్ మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలు బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్న అభివృద్ధి ఫలాలకు నిదర్శనం అన్నారు. కాగా, ఇటీవల ముంబై - అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

అందుకే బుల్లెట్ రైలు
దేశంలో ఢిల్లీ, కోల్కతా, చెన్నై వంటి ఎన్నో మెట్రో నగరాలు ఉన్నా గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు మోడీ మొగ్గు చూపారు. గుజరాతీయులు ఎక్కువగా ముంబైకి రాకపోకలు సాగిస్తుంటారనే కారణంతో ఈ రైలును ఏర్పాటు చేశారు. ఇది ఎన్నికల వ్యూహంగా కొందరు భావిస్తున్నారు.

మోడీ ఇంకేదో చేస్తారని
దాదాపు 508 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్టును జపాన్ సహకారంతో నిర్మించనున్నారు. రూ.లక్ష కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్కు జరిగింది కేవలం శంకుస్థాపనే అయినా రాష్ట్రాన్ని మోడీ పట్టించుకోవడం లేదన్న అపవాదు నుంచి బయటపడేసింది. సొంత రాష్ట్రం కోసం ఆయన ఇంకా ఏదో చేస్తారన్న భరోసాను కల్పించింది.

కాంగ్రెస్ ముందే ఊహించి
బుల్లెట్ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. దేశంలో రైల్వేల్లో భద్రతను గాలికొదిలేసి రూ.కోట్ల ప్రాజెక్టులు ఎందుకని ప్రశ్నించింది. అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్న అపవాదు ఎదుర్కొన్నా సరే ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ ముందే ఊహించినట్టు ఉందని అంటున్నారు.
2022 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి 75 ఏళ్ల స్వతంత్ర భారతానికి అంకితమిస్తారని చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications