Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌లో ప్రవక్త మ్యూజియం ఏర్పాటు చేయండి: సౌదీ సంస్థను కోరిన బిజెపి నేత

దుబాయ్: ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఉన్న రెండో అతి పెద్ద దేశమైన భారత్‌లో ముస్లింల ఆరాధ్యదైవం మహ్మద్ ప్రవక్త మ్యూజియం ఏర్పాటుచేయాలని ఓ సౌదీ సంస్థను భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ కోరారు.

ఇటీవల సౌదీ అరేబియాలో అధికారికంగా పర్యటించిన సందర్భంగా మక్కాలో ప్రవక్త జీవిత విశేషాలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్, మ్యూజియంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియంను ఏర్పాటు చేసిన అస్సలము అలైకా అయ్యుహా అన్నబియ్యు సంస్థను అభినందించారు. మ్యూజియం అద్భుతంగా ఉందని చెప్పారు.

BJP's Shahnawaz Hussain proposes a Prophet Muhammad museum in India

అంతేగాక, భారత్‌లోనూ ఈ మ్యూజియం శాఖ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రాజెక్టు జనరల్ సూపర్‌వైజర్ నసీర్ అల్ జహ్‌రానీని షానవాజ్ హుస్సేన్ కోరారు. కాగా, ఆ సౌదీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మరో 20 శాఖలను ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలిపింది.

తన పర్యటనలో భాగంగా షానవాజ్ హుస్సేనే.. అక్కడి హజ్ హుస్సేన్ ఆల్ డిప్యూటీ మినిస్టర్ ఆల్ షరీఫ్‌ను కలిశారు. ఈ సందర్భంగా భారత యాత్రీకుల సంఖ్య కోటాను పెంచాలని కోరారు. మక్కా విస్తరణ పనులు జరుగుతున్న నిరుడు 1,36,000మంది భారతీయ యాత్రికులను మాత్రమే అనుమతించారు. ఆ సంఖ్యను ఈ ఏడాది నుంచి పెంచాలని షానవాజ్ ఆయనను కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+