భారత్లో ప్రవక్త మ్యూజియం ఏర్పాటు చేయండి: సౌదీ సంస్థను కోరిన బిజెపి నేత
దుబాయ్: ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఉన్న రెండో అతి పెద్ద దేశమైన భారత్లో ముస్లింల ఆరాధ్యదైవం మహ్మద్ ప్రవక్త మ్యూజియం ఏర్పాటుచేయాలని ఓ సౌదీ సంస్థను భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ కోరారు.
ఇటీవల సౌదీ అరేబియాలో అధికారికంగా పర్యటించిన సందర్భంగా మక్కాలో ప్రవక్త జీవిత విశేషాలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్, మ్యూజియంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియంను ఏర్పాటు చేసిన అస్సలము అలైకా అయ్యుహా అన్నబియ్యు సంస్థను అభినందించారు. మ్యూజియం అద్భుతంగా ఉందని చెప్పారు.

అంతేగాక, భారత్లోనూ ఈ మ్యూజియం శాఖ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రాజెక్టు జనరల్ సూపర్వైజర్ నసీర్ అల్ జహ్రానీని షానవాజ్ హుస్సేన్ కోరారు. కాగా, ఆ సౌదీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మరో 20 శాఖలను ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలిపింది.
తన పర్యటనలో భాగంగా షానవాజ్ హుస్సేనే.. అక్కడి హజ్ హుస్సేన్ ఆల్ డిప్యూటీ మినిస్టర్ ఆల్ షరీఫ్ను కలిశారు. ఈ సందర్భంగా భారత యాత్రీకుల సంఖ్య కోటాను పెంచాలని కోరారు. మక్కా విస్తరణ పనులు జరుగుతున్న నిరుడు 1,36,000మంది భారతీయ యాత్రికులను మాత్రమే అనుమతించారు. ఆ సంఖ్యను ఈ ఏడాది నుంచి పెంచాలని షానవాజ్ ఆయనను కోరారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications