ఇదేం విడ్డూరం: ఎన్నికల కమిషన్ అఫీషియల్ నోట్ పై బీజేపీ స్టాంప్: వై అండ్ హౌ
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య కేరళ బీజేపీ రాష్ట్రశాఖ స్టాంప్ ముద్రతో కూడిన ఎన్నికల కమిషన్ అధికారిక లేఖ వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. రాజకీయ పార్టీలకు పంపిన ఓ అఫిడవిట్ అది. ఎన్నికల సంఘం అధికారిక ముద్రకు బదులుగా బీజేపీ కేరళ యూనిట్ స్టాంప్ దీనిపై ఉండటం వివాదాస్పదమైంది. దీన్ని సీపీఎం ట్విట్ చేసింది. రాజ్యాంగ సంస్థలను బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందనడానికి ఈ లేఖను నిదర్శనమని విమర్శించింది.

కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ రెండూ ఒకే శక్తి కేంద్రం నియంత్రణలో ఉన్నట్లు కనిపిస్తున్నాయని సీపీఎం ఆరోపించింది. కనీసం రెండు వేర్వేరు టేబుల్లను అయినా ఏర్పాటు చేసుకోండని చురకలు అంటించింది. ఎన్నికల కమిషన్ లేఖపై బీజేపీ స్టాంప్ ను ఓ సాధారణ తప్పిందంగా భావించకూడదని, ఈసీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి, దానిపై బీజేపీ పెత్తనం చలాయిస్తోందనడానికి ఇదొక ఉదాహరణగా పేర్కొంది.
ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా అది కమలం గుర్తుపైనే పడుతోందనే వాదనలు తరచుగా వింటోన్నామని, దాన్ని ఇప్పుడు కళ్లారా చూస్తోన్నామని సీపీఎం ధ్వజమెత్తింది. బీజేపీ- ఈసీ ఒకే ముద్రను ఉపయోగిస్తోండటం రాజ్యాంగాన్ని, ఎన్నికల ప్రక్రియను, ప్రజల తీర్పును తప్పుదోవ పట్టించినట్టేనని మండిపడింది. ఈ వివాదంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఈసీ. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
Have all pretences been dropped by the BJP?
— CPI(M) Kerala (@CPIMKerala) March 23, 2026
It is no secret that the same power centre seems to control both the Election Commission of India and the BJP. Even then, at least maintain the courtesy of two separate desks.
Now even that seems unnecessary.
Seals are being casually… pic.twitter.com/MfMXNaXTgk
ఈసీ అధికారులు బీజేపీ కార్యాలయం నుండి పనిచేస్తున్నారా అని నిలదీసింది. ఈసీ అధికారులకు బీజేపీ స్టాంప్ ఎలా అందుబాటులోకి వచ్చిందని ప్రశ్నించింది. ఈసీ లెటర్హెడ్తో అన్ని ఎన్నికల అధికారులకు బీజేపీ రాసిన లేఖగా పేర్కొంది. దీనిపై కేరళ ఎన్నికల ప్రధానాధికారి మాట్లాడారు. దీన్ని క్లరికల్ ఎర్రర్ గా పేర్కొన్నారు. దాన్ని తక్షణమే సరిదిద్దామని, దీనికి కారణమైన అధికారిని సస్పెండ్ చేశామని అన్నారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications