జై శ్రీరాం నినాదం మతానికి సంబంధించింది...! అందుకే వ్యతిరేకిస్తున్నా...! మమతా బెనర్జీ
తృణముల్ కాంగ్రస్ అధినేత్రీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆరాష్ట్ర్ర బీజేపీ నేతల మధ్య పోలిటికల్ వార్ తీవ్ర రూపం దాల్చింది.బెంగాల్లో ఇటివల జరిగిన పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జై శ్రీరాం అంటు నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలపై మమతా బెనర్జీ కన్నేర్ర జేసింది. ఈనేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య వార్ మరింత కొనసాగుతుంది...

ఈ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పది లక్షల పోస్టు కార్డులు రాసి పంపాలని అక్కడి బీజేపీ నేతలు నిర్ణయించారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ఆ రాష్ట్ర్ర బీజేపీ నేతలు ఈనిర్ణయం తీసుకున్నారు.ఇటివల బీజేపీ నేతల సమావేశం ముందు బీజేపీనేతలు జైశ్రీరాం అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. దీనికి నిరసనగానే పోస్టుకార్డుల
ప్రచారం చేస్తున్నామని వారు తెలిపారు.
మరోవైపు జై శ్రీరాం అనే నినాదం మతానికి సంబంధించిందని దాన్ని బీజేపీ రాజకీయ నినాదంగా వాడుతుందని, లౌకిక వాదం కోసం బీజేపీ నినాదాన్ని వ్యతిరేకించాలని ఆమే పిలుపునిచ్చారు. కాగా ఇటువంటీ మతపరమైన విద్వేశాలను రెచ్చగొట్టేవారికి గట్టిగా బుద్ది చెప్పాలని ఆమే బెంగాల్ ప్రజలను కోరారు.భారత దేశంలో ఉన్న సంస్కృతి సంప్రదాయలను గౌరవించాలని అన్నారు.












Click it and Unblock the Notifications