వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా క్వారంటైన్ నుంచి 9 మంది పరార్: ఆగురురిని గుర్తించిన పోలీసులు, మిగితావారి కోసం గాలింపు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు భారీ పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ముంబై చెంబూరులోని ఓ హోటల్‌ను క్వారంటైన్‌గా మార్చగా.. అందులో ఉన్న 9 మంది తప్పించుకుని పారిపోయారు. దీంతో ముంబై పోలీసులు వారిపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం: ఆదివారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకిమహారాష్ట్రలో కరోనా కల్లోలం: ఆదివారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి

దుబాయ్ నుంచి ఏడుగురు భారత జాతీయులు, కెన్యా నుంచి మరో ఇద్దరు ముంబైకి వచ్చారు. దీంతో వారిని మనస్ రెసిడెన్సీ హోటల్‌లో క్వారంటైన్లో ఉంచారు. ఈ క్రమంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు బీఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆ హోటల్‌లో ఉన్నవారంతా తప్పించుకుపారిపోయినట్లు గుర్తించారు.

BMC Staff Arrive For Coronavirus Testing of 9 Quarantined Fliers

పారిపోయినవారిలో ఆరుగురు పుణెలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వారందరి క్వారంటైన్ పీరియడ్ త్వరలో ముగియనుందని బీఎంసీ అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా చర్యలు చేపడుతున్నారు.

ముంబై ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఓ ఫైవ్ స్టార్ క్లబ్బులు భారీగా జనం గుమిగూడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలను పాటించని 15 హోటళ్లపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 18 రాత్రి నుంచి మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, శుక్రవారం ఒక్క రోజే మహారాష్ట్రంలో 36,902 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభం నుంచి నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. ఇప్పటికే పలు నగరాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కు పెట్టుకోకుంటే రూ. 500 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలను అలసత్వం ప్రదర్శిస్తే లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ప్రభుతం స్పష్టం చేసింది.

English summary
Mumbai Police will file an FIR against nine people for fleeing from a hotel in Chembur, Mumbai where they were placed in quarantine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X