అయ్యో పాపం: బావిలో బయటపడ్డ ఐదుగురు చిన్నారుల మృతదేహాలు
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. బర్వానీ జిల్లా చికిలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది చిన్నారులు మృతి చెందారు. వారి మృతదేహాలు బావిలో తేలియాడుతూ కనిపించాయి.మృతి చెందిన చిన్నారులంతా మగపిల్లలే కావడం విశేషం. వీరి వయస్సు మూడు నుంచి ఏడేళ్ల మధ్య ఉంటుందని అడిషనల్ ఎస్పీ ఓంకార్ సింగ్ కాలేష్ చెప్పారు. ప్రస్తుతం పిల్లల తల్లిదండ్రులు పరారాలో ఉన్నారని కేసును విచారణ చేస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉంటే మృతి చెందిన పిల్లల తండ్రి భరత్ సింగ్ కుటుంబంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఆయను ఇద్దరు భార్యలు అని చెప్పారు. బావిలో ఐదుగురు పిల్లల మృతదేహాలు తేలుతూ కనిపించడంతో చికిలి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోకి దూకి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు.

మృతి చెందిన వారిలో నలుగురు పిల్లలు మొదటి భార్య సుందరీబాయ్కు పుట్టారని మరో అబ్బాయి అనితా బాయ్కు పుట్టారని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం భరత్ సింగ్ అతని ఇద్దరు భార్యలు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications