అయ్యో పాపం: బావిలో బయటపడ్డ ఐదుగురు చిన్నారుల మృతదేహాలు
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. బర్వానీ జిల్లా చికిలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది చిన్నారులు మృతి చెందారు. వారి మృతదేహాలు బావిలో తేలియాడుతూ కనిపించాయి.మృతి చెందిన చిన్నారులంతా మగపిల్లలే కావడం విశేషం. వీరి వయస్సు మూడు నుంచి ఏడేళ్ల మధ్య ఉంటుందని అడిషనల్ ఎస్పీ ఓంకార్ సింగ్ కాలేష్ చెప్పారు. ప్రస్తుతం పిల్లల తల్లిదండ్రులు పరారాలో ఉన్నారని కేసును విచారణ చేస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉంటే మృతి చెందిన పిల్లల తండ్రి భరత్ సింగ్ కుటుంబంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఆయను ఇద్దరు భార్యలు అని చెప్పారు. బావిలో ఐదుగురు పిల్లల మృతదేహాలు తేలుతూ కనిపించడంతో చికిలి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోకి దూకి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు.

మృతి చెందిన వారిలో నలుగురు పిల్లలు మొదటి భార్య సుందరీబాయ్కు పుట్టారని మరో అబ్బాయి అనితా బాయ్కు పుట్టారని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం భరత్ సింగ్ అతని ఇద్దరు భార్యలు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications