ఆర్టీసీ బస్సులో టిఫిన్ బాక్సు బాంబు... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణీకులు
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఆర్టీసీ బస్సులో టిఫిన్ బాక్సులో బాంబును ఓ వ్యక్తి గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్ ఆర్టీసీకి చెందిన బస్సులో గుర్తు తెలియని దుండగులు ఓ టిఫిన్ బాక్సులో బాంబును పెట్టి దానిని బస్సులో ప్రయాణీకుల సీటు కింద ఉంచారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
బస్సు కండెక్టర్ నిర్మల్పాల్ మాట్లాడుతూ బస్సు జల్పాయ్గురి బస్టాండ్ నుంచి కొంత మంది ప్రయాణీకులతో బయలుదేరింది. ఆ తర్వాత బస్స్టాప్లో మరికొంత మంది ప్రయాణీకులు బస్సు ఎక్కారు. వారిలో తన మనవడిని ఎత్తుకొని ఉన్న ముసలాయన సీటు కింద ఉంచిన టిఫిన్ బాక్సు ఉన్న విషయాన్ని గుర్తించి తన వద్దకు వచ్చి సమాచారం తెలిపినట్లు పేర్కొన్నారు.
దీంతో విషయం తెలిసిన వెంటనే బస్సుని వెంటనే నిలిపివేసినట్లు తెలిపారు. అప్రమత్తమైన ప్రయాణికులు ఎలాంటి నష్టం జరగకుండా సురక్షితంగా బయటపడగలిగారని ఆయన పేర్కొన్నారు. రంగంలోకి దిగిన బాంబు స్యాడ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆ బాంబును నిర్వీర్యం చేశారు. టిఫిన్ బాక్సులో బాంబు ఉంచిన ఘటనపై దర్యాప్తును కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.