దారుణం: జూనియర్ను చితక బాదిన సీనియర్లు...బాలుడి మృతదేహాన్ని దాచిన స్కూలు యాజమాన్యం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది. ఒక జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు కొట్టి చంపేశారు. అయితే తమ స్కూలుకు చెడ్డ పేరు వస్తుందన్న కారణంగా జూనియర్ విద్యార్థి మృతదేహాన్ని స్కూలు యాజమాన్యం స్కూలు క్యాంపస్లోనే దాచేసింది. ఇంతకీ ఆ జూనియర్ విద్యార్థిని సీనియర్లు ఎందుకు హత్యచేశారు..? వారిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా...?

బిస్కెట్ ప్యాకెట్ దొంగలించాడని....
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లాలోని మిషనరీ స్కూలు అది. అందులో ఏడవ తరగతి చదువుతున్నాడు ఓ విద్యార్థి. అతను మీరట్కు చెందిన వాడు. అదే స్కూలులో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే స్కూలు క్యాంపస్ నుంచి అనుమతి లేకుండా ఎవరూ బయటకు వెళ్లరాదని స్కూలు యాజమాన్యం పిల్లలకు హుకూం జారీచేసింది. అంతకుముందు రోజు ఈ ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి ఓషాపు నుంచి బిస్కెట్ ప్యాకెట్ దొంగలించాడని ఆ దుకాణం యజమాని స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. దీంతో స్కూలు యాజమాన్యం పిల్లలను ఎవరినీ అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదని ఆదేశించింది.

విద్యార్థిని చితక బాదిన సీనియర్లు
ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి వల్లే తాము బయటకు వెళ్లడం సాధ్యపడటం లేదన్న కోపం సీనియర్ విద్యార్థుల్లో పెరిగింది. జూనియర్ విద్యార్థిని పట్టుకుని కొన్ని గంటలపాటు చితకబాదారు సీనియర్ విద్యార్థులు. స్కూలు బిల్డింగ్ పైకి తీసుకెళ్లి ముఖంపై చల్ల నీళ్లు చల్లి క్రికెట్ బ్యాట్లతో చితకబాదారు. ఆ తర్వాత స్టడీ రూంలో ఆ అబ్బాయిని పడేసి వెళ్లిపోయారు సీనియర్ విద్యార్థులు. ఇక సాయంత్రం సమయంలో బాధితుడు వార్డెన్ కంటపడ్డాడు. మిగతా విద్యార్థులతో కూర్చుని ఉండగా ఒక్కసారిగా వామిటింగ్ చేశాడు. దీంతో వార్డెన్ ఇతరులు ఆ అబ్బాయిని హాస్పిటల్కు తరలించారు. చికిత్స చేస్తుండగానే అబ్బాయి మృతి చెందాడు. ఫుడ్ పాయిజన్తో అబ్బాయి మృతి చెందాడని డాక్టర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక అబ్బాయి మృతి చెందాడని స్కూలు యాజమాన్యం అబ్బాయి తల్లిదండ్రులకు తెలిపింది. మార్చి 11వ తేదీన డెహ్రాడూన్కు విద్యార్థి తండ్రి చేరుకున్నాడు. విద్యార్థి తీసుకున్న ఆహారం విషపూరితం కావడంతోనే మృతి చెందాడని వైద్యులు, స్కూలు యాజమాన్యం తెలిపింది.

స్కూలు క్యాంపస్లోనే మృతదేహాన్ని పూడ్చిన యాజమాన్యం
ఇక మార్చి 23న విద్యార్థి పోస్టు మార్టం నివేదిక వచ్చింది. అసలు సంగతి బయటపడింది. విద్యార్థిని చితకబాదటం, అంతర్గతంగా పెద్ద గాయాలు అవడంతోనే విద్యార్థి మృతి చెందాడని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. ఇదిలా ఉంటే తల్లిదండ్రులు చదువులేని వారు కావడంతో స్కూలు యాజమాన్యం వారితో కొన్ని పత్రాలపై వేలిముద్రలు తీసుకుంది. ఆ తర్వాత విద్యార్థి మృతదేహంను స్కూలు క్యాంపస్లోనే అంటే మార్చి 11వ తేదీనే పూడ్చిపెట్టింది స్కూలు యాజమాన్యం. తన కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో అక్కడి స్థానికులను ఆశ్రయించాడు తండ్రి. అనంతరం రాష్ట్ర బాలల సంరక్షణ శాఖ అధికారుల వద్దకు స్థానికులు విషయాన్ని చేరవేశారు. వారు వచ్చి మృతదేహంను వెలికి తీసి పోస్టు మార్టంకు పంపారు. దీంతో అసలు విషయం బయటపడింది.

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
ఇక రంగంలోకి దిగిన పోలీసులు సీనియర్ విద్యార్థులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మృతదేహంను దాచినందుకు గాను స్కూలు మేనేజర్ ప్రవీణ్ మెస్సి, పీటీఐ టీచర్ అశోక్ సలోమోన్, హాస్టల్ వార్డెన్ అజయ్ కుమార్లను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే స్కూలు ప్రిన్సిపాల్ మాత్రం ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. తనకు హాస్టల్తో సంబంధం లేదని అబ్బాయి హాస్టల్లో మృతి చెందాడనే వాదన వినిపిస్తున్నాడు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications