Wife: అర్దరాత్రి భార్యను బయటకు పిలుచుకుని వెళ్లాడు, ఊరి బయట ఏం చేశాడంటే ?
భువనేశ్వర్/ఒడిశా: వివాహం చేసుకున్న దంపతులు చాలాకాలం సంతోషంగా కాపురం చేశారు. కొంతకాలంగా భర్త బయటకు వెళ్లిన తరువాత అతని భార్య బయట తిరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్లు, స్నేహితులు భార్య గురించి పలు విషయాలు చెప్పడంతో భర్త రగిలిపోయాడు. భార్యను కంట్రోల్ పెట్టడానికి భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే మధ్యలో భర్త అతని ప్లాన్ మార్చుకున్నాడు. భార్య విషయంలో ఆమె భర్త రివర్స్ లో స్కెచ్ వేశాడు.
Doctor: ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలు, ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసి నాలుగో భార్య?, ఆపరారేయ్ !
పాడుపడిన ఇంటిలో మహిళ శవం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలోని కొరడకాంత ప్రాంతంలోని పాడుబడిన ఇంట్లో నుండి కుళ్ళిపోయిన మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రీటా అనే మహిళను గొంతు చీల్చి హత్య చేశారని పోలీసులు గుర్తించారు.
అర్దరాత్రి భార్యను పిలుచుకుని వెళ్లి ?
భార్య రీటాను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వలు నాయక్ (30) అనే వ్యక్తిని మంచేశ్వర్ పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 28వ తేదీన తన భార్య రీటాను గొంతుకోసి హత్య చేసినట్లు నిందితుడు నలు నాయక్ అంగీకరించాడని భువనేశ్వర్ లీసులు తెలిపారు. రాత్రి ఇంట్లో ఉన్న భార్య రీటాను తనతో పాటు రమ్మని చెప్పి ఆమెను బయటకు పిలుచుకుని వెళ్లానని నాయక్ పోలీసకు చెప్పాడు.
ఎదురు తిరిగిందని భార్యను చంపేశాను
తన భార్య రీటాను నేను ఊరి బయట నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లానని నాయక్ పోలీసులకు చెప్పాడు, ఆ సందర్బంలో రీటా, నాయక్ దంపతుల మధ్య వ్యక్తిగత విషయాల్లో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సహనం కోల్పోయిన తన భార్చ రీటాకు చెంపదెబ్బ కొట్టి గొంతుకోసి హత్య చేశానని నాయక్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. రీటా మృతదేహానికి భువనేశ్వర్లోని ఎయిమ్స్లో పోస్టుమార్టం నిర్వహించారు. రీటాను ఆమె భర్త నాయక్ ఎందుకు హత్య చేశాడు ? అని పక్కా సమాచారం బయటకు లాగుతున్నామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.