పరువు హత్య: పక్కింటి వ్యక్తితో వెళ్లిందని సోదరిని నరికేశాడు
మీరట్: ఉత్తర ప్రదేశ్లో మరోసారి పరువు హత్య చోటు చేసుకుంది. యూపీలోని మీరట్లో ఈ దారుణం జరిగింది. పక్కింటి యువకునితో సంబంధం ఉందనే అనుమానంతో సొంత సోదరుడే పద్దెనిమిదేళ్ల యువతి గొంతు కోసి ప్రాణాలు తీశాడు. మృతురాలు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
నిందితుడు అమిత్ని పోలీసులు శనివారం అరెస్టు చేసి, మారణాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు అందరు నిద్రలో ఉన్న సమయంలో పొరుగింటి యువకునితో కలిసి బయటకు వెళ్లి తిరిగి వచ్చిన యువతిని ఆమె సోదరుడు అమితి ఇంట్లోకి ఈడ్చుకెళ్లి తల్లిదండ్రుల ఎదురుగానే గొంతు కోసినట్లు పోలీసులు చెప్పారు.

అదే కోపంలో ఉన్న ఆ సోదరుడు పక్కింటి యువకుడి కోసం కూడా గాలించాడని, ఆ సమయంలో అతను కనిపించలేదని, అతని అన్న కనిపించడంతో అతని పైన దాడి చేశాడు. అమిత్ నేరాన్ని అంగీకరించాడు. తన సోదరి ప్రాణాలు తీయడం పైన అతను పశ్చాత్తాప పడటం లేదు. ఆమె కుటుంబం పరువు తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.












Click it and Unblock the Notifications