బలపరీక్షలో నెగ్గిన యడియూరప్ప.. 45 నిమిషాల్లోనే!
Recommended Video
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. బలపరీక్షలో నెగ్గారు. మూజువాణి ఓటుతో ఆయన సభలో విశ్వాస పరీక్ష గండం నుంచి గట్టెక్కారు. దీనితో- ఇక భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాటుకానుంది.
ఈ వారాంతంలోగా యడియూరప్ప మంత్రివర్గాన్ని విస్తరించడం ఖాయమైంది. ఈ ఉదయం 11 గంటలకు యడియూరప్ప బలపరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) సభ్యులు మాట్లాడారు. చివరిగా- యడియూరప్ప ఈ తీర్మానంపై మాట్లాడారు. అనంతరం మూజువాణి ఓటుతో యడియూరప్ప బలపరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు.

బలపరీక్ష మొత్తం 45 నిమిషాల్లో పూర్తయింది. బీజేపీకి శాసనసభలో మొత్తం 105 మంది సభ్యుల బలం ఉంది. హాజరయ్యారు. 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్కుమార్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 103 పడిపోయింది. బీజేపీకి ప్రస్తుతం 105 సభ్యుల బలం ఉన్నందున.. ఈ బలపరీక్షలో అవలీలగా నెగ్గుకొచ్చింది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications