వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీనగర్ బిఎస్ఎఫ్ క్యాంప్పై ఉగ్రవాదుల దాడి, ఇద్దరు టెర్రరిస్టుల హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని బిఎస్ఎప్ క్యాంప్పై ఉగ్రవాదులు మంగళవారం నాడు ఉదయం దాడికి తెగబడ్డారు. అయితే ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ కాల్చి చంపేసింది. ఈ ఘటనలో ఒక జవాన్ వీరమరణం చనిపోయాడు.
బిఎస్ఎఫ్ క్యాంప్పై టెర్రరిస్టులు దాడులకు పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున టెర్రరిస్టులు ఆకస్మాత్తుగా క్యాంప్పై దాడికి పాల్పడ్డారు.
అయితే ఈ దాడులను బిఎస్ఎఫ్ దళాలు తిప్పికొట్టాయి. విషయం తెలుసుకొన్న ఉన్నతాధికారులు అదనపు బలగాలను తరలించారు.బిఎస్ఎప్ 182 బెటాలియన్ హెడ్క్వార్టర్ను లక్ష్యంగా చేసుకొని దాడికి పూనుకొన్నారు.
శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వైపుకు వెళ్ళే దారులన్నీ ప్రస్తుతం మూసివేశారు. ఆకస్మికంగా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.
Comments
English summary
Fidayeen attackers stormed the Border Security Force’s (BSF) 182nd battalion camp in Jammu and Kashmir’s Srinagar in a pre-dawn attack on Tuesday, killing one soldier.
Story first published: Tuesday, October 3, 2017, 14:20 [IST]