పఠాన్కోట్ బోర్డర్ వద్ద చొరబాటుదారుడి కాల్చివేత
పఠాన్కోట్: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ సమీపంలో చొరబాటుకు ప్రయత్నించిన ఓ అనుమానిత ఉగ్రవాదిని బిఎఫ్ఎఫ్ పోలీసులు కాల్చిపడేశారు. పఠాన్కోట్ జిల్లాలోని టాష్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
సరిహద్దు దగ్గర మంచు దట్టంగా అలుముకున్న సమయంలో ముగ్గురు చొరబాటుదారులు అక్రమంగా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. భద్రతా దళాల తూటాలకు ఒకరు హతం కాగా, మరో ఇద్దరు తప్పించుకున్నారు.

ఈ ఘటనతో సరిహద్దు సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జనవరి 2న పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్ర దాడి జరిగిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం కలవరం రేపుతోంది.
కాగా, ఇటీవల జరిగిన పఠాన్కోట్ ఉగ్రదాడిలో ఏడుగురు సైనికులు చనిపోగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.












Click it and Unblock the Notifications