బడ్జెట్కు ముందు అరుణ్ జైట్లీ సంప్రదింపులు
న్యూఢిల్లీ: రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్ను ప్రతిపాదించనున్న నేపథ్యంలో ఆయన వారితో సంప్రదింపులు జరిపారు.
ఆర్థిక విధానాలపై, బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్రాల ప్రతినిధులు ఆయనకు పలు సలహాలు ఇచ్చారు. ఆనవాయితీగా బడ్జెట్ ప్రతిపాదనకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి ఇటువంటి సమావేశం నిర్వహిస్తుంటారు.

Recommended Video

వేతన జీవులకు ఊరటే ! భారీగా పెరగనున్న ఆదాయ పరిమితి
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇచ్చిన సలహాలను, సమర్పించిన వినతిపత్రాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని అరుణ్ జైట్లీ చెప్పారు. సహకార ఫెడరిజం స్ఫూర్తితో వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు బీహార్, ఢిల్లీ, గుజరాత్, మణిపూర్, తమిళనాడులకు చెందిన డిప్యూటీ సిఎంలు, 14 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications