కేంద్ర బడ్జెట్ 2018: వాహనదారులకు ఊరట.. తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు?
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాహనదారులకు కొంత ఊరట కలిగించే అంశాన్ని ప్రకటించారు. బ్రాండెడ్, అన్బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.2 వరకు తగ్గే అవకాశమున్నట్లు తెలిసింది. బ్రాండెడ్ పెట్రోల్పై విధిస్తున్న రూ.7.66 ఎక్సైజ్ సుంకం రూ.5.66కు తగ్గనుంది. అన్బ్రాండెడ్ పెట్రోల్పై కూడా ప్రస్తుతం విధిస్తున్న రూ.6.48 ఎక్సైజ్ సుంకం కూడా రూ.4.48కు తగ్గనుంది.

అదేవిధంగా బ్రాండెడ్ డీజిల్పై రూ.10.69 ఎక్సైజ్ సుంకం రూ.8.69కు తగ్గే అవకాశముంది. అన్బ్రాండెడ్ డీజిల్పై లీటర్కు విధిస్తున్న రూ.8.33 ఎక్సైజ్ సుంకం రూ.6.33కు తగ్గనున్నట్లు తెలిసింది.
మొత్తం మీద రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న వాహనదారులకు ఇది కొంత ఊరట కలిగించే అంశమేనని చెప్పవచ్చు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications