కేంద్ర బడ్జెట్ 2018: వాహనదారులకు ఊరట.. తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు?
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాహనదారులకు కొంత ఊరట కలిగించే అంశాన్ని ప్రకటించారు. బ్రాండెడ్, అన్బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
కేంద్ర బడ్జెట్ 2018: జైట్లీ షాక్... స్టాక్ మార్కెట్లు ఢమాల్, తీవ్ర నిరాశలో మదుపరులు!
దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.2 వరకు తగ్గే అవకాశమున్నట్లు తెలిసింది. బ్రాండెడ్ పెట్రోల్పై విధిస్తున్న రూ.7.66 ఎక్సైజ్ సుంకం రూ.5.66కు తగ్గనుంది. అన్బ్రాండెడ్ పెట్రోల్పై కూడా ప్రస్తుతం విధిస్తున్న రూ.6.48 ఎక్సైజ్ సుంకం కూడా రూ.4.48కు తగ్గనుంది.
అదేవిధంగా బ్రాండెడ్ డీజిల్పై రూ.10.69 ఎక్సైజ్ సుంకం రూ.8.69కు తగ్గే అవకాశముంది. అన్బ్రాండెడ్ డీజిల్పై లీటర్కు విధిస్తున్న రూ.8.33 ఎక్సైజ్ సుంకం రూ.6.33కు తగ్గనున్నట్లు తెలిసింది.
కేంద్ర బడ్జెట్ 2018: జైట్లీ.. రెండు భాషల్లో అనర్గళంగా.., బడ్జెట్ బ్రీఫ్కేస్ వెనక కథేమిటంటే...
మొత్తం మీద రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న వాహనదారులకు ఇది కొంత ఊరట కలిగించే అంశమేనని చెప్పవచ్చు.