తిరుత్తణిలో విషాదం, కొండ మీద నుంచి పడిన బస్సు, ఒకరి మృతి, 40 మందికి తీవ్రగాయాలు !
తమిళనాడులో పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు చూడటానికి వెళ్లారుతిరుత్తణి కొండ మీద అదుపుతప్పిన టూరిస్టు బస్సు, ఒక్క సారిగా కింద పడిన బస్సుఒకరు మృతి, 40 మందికిపైగా తీవ్రగాయాలు, ప్రమాదం ఎలా జరిగిందంటే ?
Recommended Video

చెన్నై: తమిళనాడులోని తిరుత్తణి కొండ మీద వేగంగా వెలుతున్న బస్సు అదుపుతప్పి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. 40 మందికి పైగా యాత్రికులకు తీవ్రగాయాలైనాయి. బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
తమిళనాడులోని పర్యాటక ప్రాంతాలు చూడటానికి, ప్రముఖ దేవాలయాలలో పూజలు చెయ్యడానికి యాత్రికులు టూరిస్టు బస్సులో సంచరిస్తున్నారు. శనివారం మద్యాహ్నం తిరుత్తణి కొండ మీద ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడానికి యాత్రికులు టూరిస్టు బస్సులో వెళ్లారు.

ఆ సందర్బంలో వేగంగా వెలుతున్న టూరిస్టు బస్సు అదుపుతప్పింది. ఒక్క సారిగా బస్సు పల్లంలోకి పడిపోవడంతో ఒకరు అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో తీవ్ర గాయాలైన 40 మందిని రక్షించి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం ఎలా జరింది అనే విచారణ చేస్తున్నామని తిరుత్తణి పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications