నదిలో పడిన పెళ్లి బృందం బస్సు: 22మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు వంతెన నుంచి నదిలో బోల్తాపడి సుమారు 22 మంది మృత్యువాత పడ్డారు. మరో 10మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.
పెళ్లి బృందం చిన్న బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. బస్సులో చాలా మంది ఇరుక్కుపోయారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Chief Minister Shivraj Singh Chouhan has announced a compensation of Rs. 2 lakh to the kin of deceased & the injured will get compensation of Rs. 50,000: Dilip Kumar, Collector, #Sidhi
— ANI (@ANI) April 17, 2018
ప్రమాద
సమయంలో
బస్సులో
మొత్తం
44మంది
ప్రయాణికులు
ఉన్నారని
చెప్పారు.
మృతుల
కుటుంబాలకు
సీఎం
శివరాజ్
సింగ్
చౌహాను
రూ.2లక్షలు,
గాయపడిన
వారికి
రూ.
50వేలు
ఆర్థిక
సాయం
ప్రకటించారు.