బస్సు-ట్రక్కు ఢీ, 12 మంది వలసకూలీలకు గాయాలు, ఏడుగురి పరిస్థితి విషమం
లాక్డౌన్ పొడగింపులతో.. సొంత ఊర్లకి వెళ్లే వారు ఎక్కువవుతున్నారు. అయితే కొందరు ట్రక్కుల్లో వెళ్తుంటే.. మరికొందరు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఔరాయియాలో జరిగిన రోడ్డు ప్రమాదం మరవకముందే మరో యాక్సిడెంట్ జరిగింది. యూపీలోనే జరిగిన ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురి పరిస్థితి సీరియస్గా ఉంది.
బీహర్కి చెందిన వలసకకూలీలు బస్సుల్లో తమ స్వస్థలం భాగాల్పూర్ వెళుతున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి వారి బస్సు ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ వద్ద ట్రక్కును ఢీ కొంది. నేషనల్ హైవే-28 వద్ద గల ఫతేవారా పెట్రోల్ పంప్ వద్ద యక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సుల్లో 25 మంది ఉన్నారు. మిగతా 13 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యాక్సిడెంట్ అయ్యాక.. డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పారిపోయారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను తమ్కుహి హెల్త్ సెంటర్కు తరలించారు. ఔరాయియా రోడ్డు ప్రమాదం తర్వాత వలసకూలీల ప్రయాణంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టంచేశారు. తగిన రక్షణ చర్యలు తీసుకొకుంటే.. అనుమతించొద్దని చెప్పినా.. ప్రమాదం జరిగింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications