లోయలో పడిన బస్సు: 30మంది మృతి(పిక్చర్స్)
సోనాపూర్: మేఘాలయ రాష్ట్ర సరిహద్దు, అస్సాంలోని సోనాపూర్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంగళవారం రాత్రి సిల్చార్ నుంచి గౌహతికి వెళ్తున్న బస్సు మేఘాలయలోని ఈస్ట్ జైంటియా పర్వత ప్రాంతంలో సోనాపూర్ మందిర్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సులో సుమారు 35మంది ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం ఐదుగురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు పడిన లోయ సుమారు 500 అడుగుల లోతు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోయలో పడిన బస్సు
మేఘాలయ రాష్ట్ర సరిహద్దు, అస్సాంలోని సోనాపూర్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.
లోయలో పడిన బస్సు
బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
లోయలో పడిన బస్సు
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లోయలో పడిన బస్సు
మంగళవారం రాత్రి సిల్చార్ నుంచి గౌహతికి వెళ్తున్న బస్సు మేఘాలయలోని ఈస్ట్ జైంటియా పర్వత ప్రాంతంలో సోనాపూర్ మందిర్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సులో సుమారు 35మంది ఉన్నట్లు సమాచారం.