మే 31 వరకు గోధుమల సేకరణను కొనసాగించండి: రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

న్యూఢిల్లీ: గోధుమ సేకరణను మే 31 వరకు కొనసాగించాలని దేశంలోని గోధుమలను ఉత్పత్తి చేసే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. గోధుమ సేకరణ వేగం పెంచాలని సూచించింది.

గోధుమ సేకరణ సీజన్ పొడిగింపు అనేది 'రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా అంచనా వేయబడింది' అని మంత్రిత్వ శాఖ తెలిపింది. సెంట్రల్ పోల్ కింద గోధుమ సేకరణను కొనసాగించాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ)ని కూడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సేకరణ సీజన్‌ను పొడిగించాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ.

మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, బీహార్, రాజస్థాన్‌లలో రబీ మార్కెటింగ్ సీజన్ (RMS) 2022-2023లో సెంట్రల్ పూల్ కింద గోధుమల సేకరణ సజావుగా సాగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రబీ మార్కెటింగ్ సీజన్ ఏప్రిల్ నుంసీ మార్చి వరకు ఉంటుంది.

Buy wheat till May 31: Centre tells States

"గత రబీ మార్కెటింగ్ సీజన్(ఆర్ఎంఎస్) 2021-22కి అనుగుణంగా RMS 2022-23 సమయంలో సెంట్రల్ పూల్ కింద గోధుమ సేకరణ తక్కువగా ఉంది. ప్రధానంగా MSP కంటే ఎక్కువ మార్కెట్ ధరల కారణంగా, రైతులు ప్రైవేట్ వ్యాపారులకు గోధుమలను విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మే 13న గోధుమల అధిక ధరలను నియంత్రించడానికి గోధుమల ఎగుమతిని పరిమితం చేయాలని నిర్ణయించింది, అయితే, తిరిగి పొందలేని రుణ లేఖలు, పొరుగు/ఆహార లోటు దేశాల నుంచి అభ్యర్థనలు మినహా' అని తెలిపింది.

మే 14 వరకు 180 లక్షల మెట్రిక్ టన్నులు(ఎల్ఎంటీ) సేకరించగా, 2021-2022 మధ్య కాలంలో 367 ఎల్ఎంటీ సేకరించింది. 16.83 లక్షల రైతులు ఎంఎస్పీ విలువతో విక్రయించి రూ. 36,208 కోట్లు పొందారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+