టిక్టాక్పై భారతీయ ముద్ర: ఆ బిగ్షాట్ పెట్టుబడులు? చర్చల దశలో: ఫలిస్తే.. వారికి పండగే
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, ఘర్షణ వాతావరణం అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. చైనాతో వాణిజ్య సంబంధాలను తెంచుకుంది భారత్. ఆ దేశంతో కుదుర్చుకున్న పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది. చైనా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిన ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంది. రైల్వే, టెలికం, ఇన్ఫ్రా వంటి కీలక రంగాల్లో చైనా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిన పనులను ఉపసంహరించింది. తాజాగా టిక్
Recommended Video

టిక్టాక్కు మంచి ఆదరణ
చైనాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు తయారు చేసిన పలు యాప్లపైనా భారత్ వేటు వేసింది. చైనా యాప్లను నిషేధించింది. టిక్టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ వంటి 59 రకాల యాప్లను వినియోగానికి బ్రేక్ వేసింది. భారత్లో టిక్టాక్కు ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. స్మార్ట్ఫోన్ను వినియోగించే 80 శాతం మంది టిక్టాక్ను ఇన్స్టాల్ చేసుకున్నారంటే భారత్లో దానికి ఉన్న ఆదరణ ఏ రేంజ్లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

రిలయన్స్తో బైట్ డాన్స్ చర్చలు
చైనాతో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం అనంతరం.. టిక్టాక్పై నిషేధం వేటు పడిన ప్రస్తుత పరిస్థితుల్లో బైట్డాన్స్ యాజమాన్యం కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనా ముద్రను చెరిపి వేసుకునేలా అడుగుల వేస్తున్నట్లు సమాచారం. టిక్టాక్పై భారతీయ ముద్ర పడేలా చేయడానికి ప్రయత్నాలను ఆరంభించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా- పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్చల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఆఫర్ను అంబానీ అంగీకరిస్తారా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంతో ఇప్పటికే ఈ దిశగా ప్రతిపాదనలను పంపించినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది. దీనిపై ప్రత్యేక కథనాలను ప్రచురించింది. టిక్టాక్కు ఉన్న భారత్లో ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ యాజమాన్యం సానుకూలంగా స్పందించడానికి అవకాశాల లేకపోలేదని అంటున్నారు. ఈ చర్చలు గనక ఫలిస్తే.. టిక్టాక్ మరోసారి దేశంలో తన ప్రభంజనాన్ని కొనసాగించడం, పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

టిక్టాక్లో ఇన్వెస్ట్ చేసేందుకు దిగ్గజ కంపెనీలు
అమెరికాలో కూడా టిక్టాక్ నిషేధం వేటును ఎదుర్కొంటోంది. అదే సమయంలో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్, ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సంస్థలు టిక్టాక్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయంటూ ఇదివరకు వార్తలు వెలువడ్డాయి. రిలయన్స్ యాజమాన్యం కూడా ఈ దిశగా సానుకూల నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా చెబుతోంది. ఆయా సంస్థలు టిక్టాక్లో పెట్టగలిగితే.. చైనా ముద్ర చెరిగిపోతుందని, ఫలితంగా నిషేధం వేటు తప్పుతుందని అంచనా వేస్తున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications