ఘోరం: తోటి జవాన్లపై మరో జవాన్ కాల్పులు, నలుగురు మృతి
బీజాపూర్: ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జవాను తోటి జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.

బాసుగూడలోని సీఆర్పీఎఫ్ సీక్యాంపు 168 బెటాలియన్కు చెందిన శాంత్ కుమార్ అనే కానిస్టేబుల్ ఇన్సాస్ రైఫిల్తో విచక్షణా రహితంగా కాల్పులకు దిగాడు. దీంతో విక్కీ శర్మ, గజానంద్, రజ్వీర్ సింగ్, శంకర రావు, మేఘ్ సింగ్ అనే నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృత్యువాతపడగా మరొకరు గాయపడ్డారు.

అయితే, శాంత్ కుమార్ ఈ ఘోరానికి ఎందుకు తెగబడ్డాడనే విషయం తేలాల్సి ఉంది. వీరి మధ్య చోటు చేసుకున్న ఘర్షణే ఈ కాల్పులకు దారితీసిందా? లేక మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలున్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications