CAA protest : అస్సాంలో 10 రోజుల తర్వాత కోర్టు ఆదేశాలతో అందుబాటులోకి ఇంటర్నెట్ సేవలు

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసోంలో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి.పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండడంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే .దాదాపు 10 రోజుల తర్వాత కోర్టు ఆదేశాలతో నేడు అసోం లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబడ్డాయి.

హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో పది జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది . రాష్ట్రంలో శాంతి, ప్రశాంతతకు సోషల్‌మీడియా వేదికలు భంగం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపిన విషయమ తెలిసిందే . లఖింపూర్‌, ధిమాజీ, తిన్సుకియా, డిబ్రుగఢ్‌, చారాడియో, శివసాగర్‌, జోర్హాట్‌, గోలాఘాట్‌, కామ్‌రూప్‌ (మెట్రో), కామ్‌రూప్‌ జిల్లాల్లో సేవలను నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంది.

CAA Protest: Internet services available after 10 days of court orders in Assam

అయితే దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మొబైల్ డేటా మరియు బ్రాడ్‌బ్యాండ్ రెండింటి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే అంశంపై జర్నలిస్ట్ అజిత్ కుమార్ భూయాన్, న్యాయవాది బోనోశ్రీ గొగోయ్ మరియు మరో ఇద్దరు గౌహతి కోర్టులో పిటీషన్ లను దాఖలు చేశారు. నాలుగు పిఎల్‌లను విచారించి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు విచారించి , ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా, జస్టిస్ అచింత్య మల్లా బుజోర్ బారువాతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని చెప్పటంతో నేటి నుండి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+