ఢిల్లీలో మణిపూర్ కాల్ సెంటర్ ఉద్యోగిని కొట్టిచంపారు
న్యూఢిల్లీ: మణిపూర్కు చెందిన ఓ వ్యక్తిని ఐదారుగురు వ్యక్తులు ఢిల్లీలో ఆదివారం రాత్రి కొట్టి చంపారు. దాదాపు 20 ఏళ్ల వయస్సున్న బిపివో ఉద్యోగి శాలోన్ ఓ గుంపుతో వాగ్వివాదానికి దిగాడు. దాంతో వారు అతన్ని తీవ్రంగా కొట్టారు. దాంతో అతను మరణించాడు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని కోట్ల ప్రాంతంలో జరిగింది.
కార్యాలయం నుంచి ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో గొడవ జరిగింది. ఆ వ్యక్తులు తెల్ల రంగు కారులో గురుద్వారా రోడ్డులోని బిగ్ ఆపిల్ షాప్నకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గొడవ జరగడంతో వారు శాలోనిపై దాడి చేశారు.
ఆ సంఘటనను చూసిన వ్యక్తి ఒకరు పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని శాలోనీ ఎయిమ్స్కు తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు.
దాడికి దారి తీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్ డిటైల్స్ను పరిశీలిస్తున్నారు. హత్య నేరం కింద కేసు నమోదు చేసుకున్నారు.