మీతో మాట్లాడతారట: దావూద్ మనిషినంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఫోన్
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనిషిని అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడం కలకలం రేపింది. బాంద్రాలోని ఉద్ధవ్ వ్యక్తిగత నివాసమైన మాతోశ్రీకి శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రెండుసార్లు ఈ ఫోన్ వచ్చింది.
Recommended Video
ఈ క్రమంలో మాతోశ్రీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దుబాయ్ నుంచి దావూద్ తరపున మాట్లాడుతున్నానని.. ఉద్ధవ్తో దావూద్ ఇబ్రహీం మాట్లాడాలని అనుకుంటున్నారన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం కావడం గమనార్హం. అయితే, ఆ ఫోన్ ఎత్తిన వ్యక్తి మాత్రం సీఎం ఉద్ధవ్కు ఇవ్వేలేదు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, కేసు నమోదు చేయలేదు.

ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. నిజంగానే దుబాయ్ నుంచి ఫోన్ వచ్చిందా? లేదా ఇంకేదైనా ప్రాంతం నుంచి చేశారా? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ కాల్లో అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి బెదిరింపులు రాలేదు.
ఈ ఘటనను ధృవీకరించిన ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్.. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. బాంద్రాలోని మాతోశ్రీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఇక ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ మాట్లాడుతూ.. శివసైనికులే మాతోశ్రీని కాపాడుకుంటారని, ఎవరూ కూడా ఉద్ధవ్ను తాకలేరని వ్యాఖ్యానించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications