ఇప్పుడే 10వేలకోట్లు ఇవ్వలేం: సుబ్రతపై సుప్రీంకి సహారా

ఈ ప్రతిపాదలను కోర్టు తిరస్కరించింది. దాంతో సుబ్రతా విడుదలకు సహారా చేసిన యత్నం విఫలమైంది. మొదట రూ.2,500 కోట్లు చెల్లిస్తామని, సుబ్రతా బయటకు వచ్చిన తర్వాత రూ.25 వేల కోట్లు డిపాజిట్ చేస్తామని సహారా గ్రూప్ ప్రతిపాదించింది. దానికి న్యాయస్థానం అంగీకరించలేదు.
కాగా, సహారా గ్రూప్ యజమాని సుబ్రతా రాయ్కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వారం రోజుల క్రితం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కావాలంటే పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆయనను ఆదేశించింది.
ఐదువేల కోట్ల రూపాయల నగదు, మరో ఐదువేల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీ చూపించాలని సుప్రీం కోర్టు సుబ్రతా రాయ్ను ఆదేశించింది. జస్టిస్ కెఎస్ రాధాకృష్షణ్, జస్టిస్ జెఎస్ ఖేహర్లతో కూడిన ధర్మాసనం సుబ్రతా రాయ్కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను ఇచ్చింది.
అదే సమయంలో స్తంభింప చేసిన బ్యంకు ఖాతాలను డీఫ్రీజ్ చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. సహారా కంపెనీకి సంబంధించిన ఏఏ బ్యాంకు అకౌంట్లను డీఫ్రీజ్ చేయాలో ఆ అకౌంటు నెంబర్లు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం కేసును ఈ రోజుకు (గురువారానికి) వాయిదా వేసింది. అయితే, సహారా ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది. సుబ్రతా రాయ్ మార్చి 4 నుండి జైలులో ఉంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications