లిఫ్ట్ ఇస్తామని కారులో గ్యాంగ్ రేప్, స్పృహ కోల్పోయాక బాధితురాలిని ఇలా.....
ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు ప్రతి రోజూ చోటుచేసుకొంటూనే ఉన్నాయి. ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు జరిగిన ఘటనలు లేకుండా ఒ:క్క రోజూ కూడ ఉండడం లేదు.దీంతో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకొంటున్నా కాని అత్యాచారాలు
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అత్యాచారాల ఘటనలు ప్రతి రోజూ చోటుచేసుకొంటూనే ఉన్నాయి. ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు రిపోర్టు అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకొన్నా ఈ దారుణాలు మాత్రం ఆగడం లేదు.
ఢిల్లీ నగర శివార్లలోని తిమార్ పూర్ గ్రామం వద్ద ఓ మహిళపై గ్యాంగ్ రేప్ చోటుచేసుకొంంది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి నలుగురు వ్యక్తులు మహిళను కారులో ఎక్కించుకొని వెళ్ళి రేప్ చేశారు.
డిల్లీ శివార్లలోని రోహిణి, ఉత్తర ఢిల్లీ ప్రాంతాల్లో కారులో తిప్పుతూ నలుగురు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. .నలుగురు ఆ మహిళపై అత్యాచారం చేయడంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది.
స్పృహ కోల్పోయిన మహిళను వారు హీరాంకి గ్రామం వద్ద వదిలేసి వెళ్ళారు. స్పహలోకి వచ్చాక బాధితురాలు అలీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళను పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.