పట్టపగలే వ్యాపారిని కాల్చి చంపారు(వీడియో)
రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరీద్కోట్లో పట్టపగలే ఓ పారిశ్రామిక వేత్తను రివాల్వర్తో కాల్చి చంపారు దుండగులు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఛండీఘర్: రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరీద్కోట్లో పట్టపగలే ఓ పారిశ్రామిక వేత్తను రివాల్వర్తో కాల్చి చంపారు దుండగులు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఫరీద్కోట్లోని తన మిల్లు ముందే శనివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో మిల్ యజమాని రవీంద్ర పప్పుకొచ్చర్ను దుండగులు కాల్చి చంపారు.
వివరాల్లోకి వెళితే.. స్థానిక పారిశ్రామికవేత్త రవీంద్ర పప్పు కొచ్చర్ ఆదివారం తన మిల్లుకు కారులో బయల్దేరాడు. మిల్లు గేటు ముందు కారును పార్క్ చేస్తుండగా.. ఆ వెనుకే కొచ్చర్ను ఫాలో అవుతూ మరో కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి కిందకు దిగాడు.
కొచ్చర్ అతడిని గమనించేలోపే తుపాకీ తీసుకుని నాలుగు సార్లు కాల్చాడు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి మరోసారి కాల్చాడు. అనంతరం కారెక్కి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కొచ్చర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
స్థానిక సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. కారును గుర్తించామని దాని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలో కూడా రవీంద్రకు ఈ గ్యాంగ్స్టర్ల నుంచి డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పుడు రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే, పోలీసులు సరైన రక్షణ కల్పించకపోవడం వల్లే తన సోదరుడ్ని నిందితులు హత్య చేశారని రవీంద్ర సోదరుడు తెలిపాడు.