వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధి విచిత్రం: టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్ బోల్తా.. ముగ్గురు మృతి

|
Google Oneindia TeluguNews

అప్పుడప్పుడు జరిగే ప్రమాదాలు విస్మయానికి గురిచేస్తాయి. కర్ణాటక ఉడుపిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. రోగిని ఆసుప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలో ఓ అంబులెన్స్ ప్ర‌మాదానికి గురయ్యింది. రోగిని త్వ‌రగా ఆసుప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలో వేగంతో వ‌చ్చిన అంబులెన్స్ టోల్ ప్లాజా వ‌ద్ద అదుపు త‌ప్పింది. అక్కడ ప‌నిచేసే సిబ్బందిని ఢీకొట్టింది. ఆపై జారుకుంటూ అల్లంత దూరం వెళ్లి బోల్తా ప‌డింది. ఆ అంబులెన్స్ ఉడుపి జిల్లాలోని హొన్నావర నుంచి కుందాపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

 Caught on CCTV, ambulance flips over, smashes into toll, 3 killed

అంబులెన్స్ డ్రైవ‌ర్ స‌హా ముగ్గురు చ‌నిపోయారు. మ‌రో న‌లుగురికి తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ టోల్ ప్లాజాకు స‌మీపిస్తున్న స‌మ‌యంలో వాహ‌నాల దారిలో ప‌డిపోయిన ఓ డివైడ‌ర్‌ను తీసేందుకు వెళ్లిన టోల్ ప్లాజా ఉద్యోగి... అంబులెన్స్ వేగంగా రావడం చూసి ఆశ్చర్యపోయాడు. అంబులెన్స్ నుంచి త‌ప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. వేగంగా వ‌చ్చి అడ్డంగా తిరిగిన అంబులెన్స్ తొలుత టోల్ ప్లాజా వద్ద ఉద్యోగినే ఢీకొట్టింది. ఆపై నేల‌పై జారుకుంటూ వెళ్లి ప‌ల్టీ కొట్టింది. దీంతో డ్రైవ‌ర్ కేబిన్‌లోని వారంతా టాప్ లేచిపోవ‌డంతో ఎగిరి ప‌డ్డారు.

అంబులెన్స్ ఉడుపి జిల్లాలో గల ఓ ప్రైవట్ ఆస్పత్రికి చెందింది. ప్రమాదం చూసిన వారు ఇదేంటి ఇలా జరిగిందని నోరెళ్లబెడుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళుతూ ఇలా ప్రమాదం జరగడంతో.. మొత్తం ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు.

English summary
3 people died after speeding ambulance skidded and crashed into a toll booth in Karnakata's Shiroor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X