మళ్లీ రగులుతోన్న కావేరీ వివాదం.. మాండ్యాలో ఉద్రిక్తత పరిస్థితులు
కర్ణాటక : కావేరి జల వివాదం మళ్లీ రగులుతోంది. కావేరి నుంచి తమిళనాడుకు నీటి విడుదలపై.. కర్ణాటక వేసిన పిటిషన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో.. అక్కడి ప్రజలు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. ఈ నెల 27 నుంచి తమిళనాడుకు 6వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాల్సిందిగా సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాండ్యా ప్రాంత రైతులు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తోన్న మాండ్య రైతులు.. కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయడమంటే తమకు ఉరి వేసినట్లేనని.. రోడ్లపై ఉరివేసుకున్నట్లుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేసి తమకు ఉరిశిక్ష వేసినంత పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదే అంశంపై మాండ్యా ప్రాంతానికి చెందిన జనతాదళ్ ఎంపీలు, ఎమ్మల్యేలు జిల్లా నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేసి తమ వ్యతిరేకతను చాటుకున్నారు. మాండ్యా డిప్యూటీ కమిషనర్ ద్వారా తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు పంపించారు మాండ్యా ఎంపీ పుత్తరాజు. జనతాదళ్ ఎంపీ పుత్తరాజు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోను ఆందోళనలు చోటు చేసుకుంటుండడంతో.. అప్రమత్తమైన పోలీసులు బెంగుళూరులో భారీగా పోలీసు బలగాలను మోహిరించారు. దీనిపై స్పందించిన కర్ణాటక హోంమంత్రి ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా కోరారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications