నీరవ్ మోడీ స్కామ్: పిఎన్బీ జనరల్ మేనేజర్ అరెస్టు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేష్ జిందాల్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అరెస్టు చేసింది. 2009 ఆగస్టు నుంచి 2011 మే వరకు ఆయన అక్రమాలు జరిగిన పిఎన్బీ బ్రాడీ హౌస్ బ్రాంచ్ బాధ్యతలు చూశారు.
2011 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పలువురు అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో రాజేష్ జిందాల్ కూడా ఉన్నారు. మరో జనరల్ మేనేజర్ అనిల్ బన్సాల్ను కూడా పిఎన్బీ సస్పెండ్ చేసింది. ఈయన 2015లో సర్కిల్ హెడ్గా ఉన్నారు. గోకుల్నాథ్ శెట్టి బదిలీ ఆదేశాలను ఆయన రద్ద చేశారు. దానివల్ల ఏడేళ్ల పాటు గోకుల్నాథ్ శెట్టి బ్రాడీ హౌస్ బ్రాంచ్లో కొనసాగాడు.

నీరవ్ మోడీకి, అతని కంపెనీలకు గోకుల్నాథ్ శెట్టి వందకు పైగా ఎల్ఓయులను జారీ చేశాడు. గోకుల్నాథ్ శెట్టిని సిబిఐ ఇదివరకే అరెస్టు చేసింది. నీరవ్ మోడీ ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న ఉన్నతాధికారి విపుల్ అంబానీని సిబిఐ మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
నీరవ్ మోడీకి చెందిన డైమండ్ ఆర్ యుఎస్, స్టెల్లార్ డైమండ్, సోలార్ ఎక్స్పోర్ట్ కంపెనీలకు చెందిన విపుల్ అంబానీతో పాటు కవిత మంకీకర్, అర్జున్ పాటిల్లను కూడా సిబిఐ మంగళవారం అరెస్టు చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications