వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూ ప్రసాద్‌కు శిక్ష ఖరారు: సీబీఐ కోర్టు సంచలన తీర్పు: జైలు..లక్షల్లో జరిమానా

|
Google Oneindia TeluguNews

రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ దోషిగా తేలారు. దాణా కుంభకోణంతో ముడిపడి ఉన్న అయిదు కేసుల్లోనూ ఆయనను దోషిగా నిర్ధారించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కొద్ది సేపటి కిందటే శిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు తుది తీర్పును వెలువడించింది.

మంత్రి మేకపాటి హఠాన్మరణంపై అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలుమంత్రి మేకపాటి హఠాన్మరణంపై అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు

రూ.950 కోట్ల స్కామ్

రూ.950 కోట్ల స్కామ్

ఈ కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో బిహార్‌లో చోటు చేసుకున్న ఈ దాణా కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 1996లో తొలిసారిగా ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పశుసంవర్ధక శాఖపై అధికారులు నిర్వహించిన దాడుల సందర్భంగా ఈ కుంభకోణాన్ని గుర్తించారు. ఈ కుంభకోణం విలువ 950 కోట్ల రూపాయలు.

అన్నింట్లోనూ దోషిగా..

అన్నింట్లోనూ దోషిగా..

ఈ కుంభకోణంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. లాలూ ప్రసాద్‌ను నిందితుడిగా గుర్తిస్తూ 1997 జూన్‌లో ఛార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. లాలూతో పాటు బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా పేరును ఇందులో చేర్చారు. లాలూ ప్రసాద్‌పై మొత్తం అయిదు కేసులు నమోదయ్యాయి. ఈ అయిదింట్లోనూ ఆయన దోషిగా తేలారు. దొరండా ట్రెజరీ నుంచి 139.50 కోట్ల రూపాయలను విత్‌డ్రా చేసినట్లు రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తాజాగా నిర్ధారించింది.

ట్రెజరీల నుంచి విత్‌డ్రా..

ట్రెజరీల నుంచి విత్‌డ్రా..

దీనితో దాణా కుంభకోణంలో నమోదైన అయిదు కేసుల్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలినట్టయింది. ఛాయ్‌బాసా ట్రెజరీ నుంచి రెండు విడతల్లో రూ.37.7 కోట్లు, 33.13 కోట్లు, దేవ్‌గఢ్ ట్రెజరీ నుంచి రూ.89.27 కోట్లు, దుమ్కా ట్రెజరీ నుంచి 3.76 కోట్ల రూపాయలను పశువుల దాణాను కొనుగోలు చేయడానికి విత్‌డ్రా చేశారని, ఆ మొత్తాన్ని మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా కేసులన్నింట్లోనూ లాలూను దోషిగా తేల్చింది న్యాయస్థానం. అయిదో కేసు- దొరండా ట్రెజరీ నుంచి విత్‌డ్రా. ఇందులో కూడా ఈ నెల 15వ తేదీన సీబీఐ న్యాయస్థానం లాలూను దోషిగా గుర్తించింది.

Recommended Video

Fodder scam : దాణా స్కాం: లాలూకు శిక్ష ఖరారు వాయిదా !
శిక్ష ఖరారు..

శిక్ష ఖరారు..

ఆయనకు విధించాల్సిన శిక్షను ఖరారు చేసింది. కొద్దిసేపటి కిందటే రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తన తుది తీర్పును వెలువడించింది. లాలూ ప్రసాద్‌కు అయిదు సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. దీనితో పాటు 60 లక్షల రూపాయల భారీ జరిమానాను విధించింది. తొలి నాలుగు కేసుల్లో లాలూకు 14 సంవత్సరాల జైలుశిక్ష పడింది. ఆయన ఇప్పటికే జైలు శిక్షను అనుభవించారు. అనారోగ్య కారణాలతో సీబీఐ న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

English summary
CBI court in Ranchi sentences RJD leader Lalu Prasad Yadav to 5 years' imprisonment and imposes Rs 60 Lakh fine on him in Fifth fodder scam case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X