ఉడిపి స్వామీజీ అనుమానాస్పదమృతి, మఠంలో సీసీ కెమెరాల డీవీఆర్ మాయం, రమ్యా!
బెంగళూరు: ఉడిపిలోని శిరూరు మఠం శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ అనుమానాస్పదమృతి కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. విష ప్రయోగం జరగడం వలనే శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ మరణించారని మణిపాల వైద్యులు ఇప్పటికే మీడియాకు, పోలీసులకు చెప్పారు.

అపరచితుడు
శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో శిరూరు మఠంలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మఠం సిబ్బంది స్వామీజీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న సమయంలో ఆ గుర్తు తెలియని వ్యక్తి లోపలికి ప్రవేశించాడని, అతని గురించి వారు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.

డీవీఆర్ మాయం
శిరూరు మఠంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డీవీఆర్ ను ఎత్తుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారైన విషయం పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. డీవీఆర్ ఎందుకు చోరీ చేశారు ? అనే విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.

డీవీఆర్ లో రహస్యం
డీవీఆర్ పోలీసులకు చిక్కి ఉంటే శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ అనుమానాస్పదమృతి కేసు విషయంలో పోలీసులకు కొన్ని వాస్తవాలు తెలిసే అవకాశం ఉండేదని, అన్ని రహస్యాలు బయటకు వచ్చే అస్కారం ఉండేదని మఠం సిబ్బంది అంటున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తి డీవీఆర్ మాయం చెయ్యడంతో పోలీసులకు పెద్ద తలనొప్పి ఎదురైయ్యింది.

రమ్యా శెట్టి, వంట మనిషి
ఇప్పటికే బ్రహావర ప్రాంతానికి చెందిన రమ్యా శెట్టిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు, మఠంలోని వంట మనిషిని సైతం పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీకి, రమ్యా శెట్టి మద్య ఎలాంటి సంబంధం ఉంది అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications