Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెరుగుతున్న బియ్యం ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో రోజుకు రోజుకు పెరుగుతున్న బియ్యం ధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బాస్మతి కాకుండా ఇతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) గురువారం నోటిపికేషన్ జారీ చేసింది.

పాక్షికంగా మరపెట్టిన, పూర్తిగా మరపెట్టిన పాలిష్ చేయని తెల్లటి బియ్యం ఎగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుంది. నోటిఫికేషన్ వెలువడడానికి కంటే ముందే ఓడల్లో బియ్యాన్ని లోడ్ చేయడం ప్రారంభించి ఉంటే అలాంటి ఎగుమతులకు అనుమతిస్తామని డీజీఎఫ్టీ పేర్కొంది. ఇక ఆహార భద్రత అవసరాల కింద ప్రభుత్వం అనుమతించిన దేశాలకు బియ్యం ఎగుమతులను మినహాయించారు.

Central Govt bans exports of non-basmati white rice to boost domestic supply

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో చాలా చోట్ల వరినాట్లు ఆలస్యమయ్యాయి. మరోవైపు, ఇటీవల విస్తారంగా వర్షాలు కురుస్తున్న కారణంగా మరికొన్ని చోట్ల పంట నాశనమైంది. ముఖ్యంగా ఉత్తరాదిలో పంజాబ్, హర్యానాలో పంట దెబ్బతింది. దీంతో బియ్యం ఉత్పత్తిపై ప్రభావం అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం.. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది.

ఇప్పటికే దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో బియ్యం ధరలు అదుపులో ఉండే అవకాశం ఉంది. గతంలోనూ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. సరఫరా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో మళ్లీ నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా, బియ్యం ధరలను కట్టడి చేసేందుకు నిషేధం విధించింది.

కాగా, బియ్యం దేశీయ ధరలు పెరుగుతున్న ధోరణిలో ఉన్నాయి. రిటైల్ ధరలు ఏడాదిలో 11.5 శాతం, గత నెలలో 3 శాతం పెరిగాయి' అని డీజీఎఫ్టీ పేర్కొంది.ధరను తగ్గించడంతోపాటు దేశీయ మార్కెట్‌లో లభ్యతను నిర్ధారించడానికి బాస్మతియేతర తెల్ల బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం సెప్టెంబర్ 8, 2022న విధించబడింది. అయితే, ఈ రకం ఎగుమతి గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్-మార్చి కాలంలో 33.66 లక్షల టన్నుల నుంచి 2022-23 సెప్టెంబర్-మార్చి కాలంలో 42.12 లక్షల టన్నులకు పెరిగింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, సుమారు 15.54 లక్షల టన్నుల తెల్ల బియ్యం ఎగుమతి చేయబడింది. గత ఏడాది ఇదే కాలంలో 11.55 లక్షల టన్నులు మాత్రమే ఎగుమతి చేయబడింది, అంటే 35 శాతం పెరుగుదల. తాజాగా, బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడంతో దేశంలోని వినియోగదారులకు తక్కువ ధరలకు బియ్యం లభించనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+