బాధ్యత మీదేనని జైట్లీ, రాజకీయ విభేదాలు అడ్డుకోవని మమతాబెనర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ‘బెంగాల్ గ్లోబల్ సమ్మిట్' పేరిట పెట్టుబడిదారుల సదస్సును ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. ఈ సదస్సుకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆయా కంపెనీలకు చెందిన సుమారు వెయ్యిమంది ప్రతినిధులు హాజరయ్యారు.
సదస్సులో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా ఉన్న బెంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. బెంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా పొరుగున ఉన్న భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, చైనా దేశాలతోనూ కార్యకలాపాలు సాగించడానికి వీలుంటుందన్నారు.
రాజకీయ విభేదాలు పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకోలేవని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ మిత్రదేశం అన్నారు. అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... దేశం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చవలసిన బాధ్యత మమతా బెనర్జీ పైన ఉందని చెప్పారు.

అరుణ్ జైట్లీ, మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్లో ‘బెంగాల్ గ్లోబల్ సమ్మిట్' పేరిట పెట్టుబడిదారుల సదస్సును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సదస్సుకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు.

అరుణ్ జైట్లీ, మమతా బెనర్జీ
రాజకీయ విభేదాలు పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకోలేవని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అరుణ్ జైట్లీ మాట్లాడుతూ... దేశం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలన్నారు.

వైబ్రాంట్ గుజరాత్
గుజరాత్లోని అహ్మదాబాద్లో ‘వైబ్రంట్ గుజరాత్' పేరిట నిర్వహించనున్న పెట్టుబడిదారుల సదస్సుకంటే ముందే బెంగాల్ ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. దీంతో బెంగాల్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే గుజరాత్ సదస్సుకు ముందుగా పోటీ సమావేశం నిర్వహిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆనందీ బెన్ పటేల్
కాగా రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు అంటూ తృణమూల్ నేతలు ఆ విమర్శలను కొట్టి పారేస్తున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు.

సమ్మిట్
‘బెంగాల్ గ్లోబల్ సమ్మిట్' పేరిట పెట్టుబడిదారుల సదస్సును రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నమస్కారం.

సమ్మిట్
పశ్చిమ బెంగాల్లో ‘బెంగాల్ గ్లోబల్ సమ్మిట్' పేరిట పెట్టుబడిదారుల సదస్సును ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది.

సమ్మిట్
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రారంభించిన బెంగాల్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ దృశ్యం.












Click it and Unblock the Notifications