చమురు ధరల తగ్గింపుకు కేంద్రం మరో నిర్ణయం-త్వరలో ఐదు మిలియన్ బ్యారెళ్ల నిల్వల రిలీజ్
దేశవ్యాప్తంగా చమురు ధరలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. కొంతకాలంగా స్ధిరంగా పెరుగుతూ వచ్చిన ధరలు లీటరు పెట్రోల్, డీజిల్ ను వంద రూపాయలు దాటించేశాయి. కేంద్రం తాజాగా ప్రజాగ్రహంతో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని సూచించింది. కానీ ఇంకా చాలా రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించకపోవడంతో చమురు ధరలు మండుతున్నాయి. దీంతో కేంద్రంపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.
భారత్ లో చమురు ధరల మంట నేపథ్యంలో అమెరికా, జపాన్, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో కలిసి ధరలను తగ్గించడానికి కేంద్రం తన అత్యవసర నిల్వ నుండి సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విడుదల చేయాలని భావిస్తోంది.

భారతదేశం తూర్పు, పశ్చిమ తీరంలో మూడు ప్రదేశాలలో భూగర్భ గుహలలో అత్యవసర పరిస్ధితుల్లో వాడకం కోసం సుమారు 38 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేస్తోంది. ఇందులో దాదాపు 5 మిలియన్ బ్యారెళ్లను 7-10 రోజులలోపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇలా విడుదల చేసే క్రూడాయిల్ రిజర్వులను మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (HPCL) లకు విక్రయించనున్నారు. ఈ రెండు సంస్ధలు పైప్లైన్ ద్వారా వ్యూహాత్మక నిల్వలకు అనుసంధానించి ఉన్నాయి. ఇలా అత్యవసర నిల్వల్ని మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా చమురు ధరల తగ్గుదల సాధ్యమవుతుందని కేంద్రం చెబుతోంది. చమురు నిల్వల్ని మార్కెట్లోకి పంపడం ద్వారా చమురు లభ్యత పెరిగి ధరలు అదుపులోకి వచ్చేందుకు వీలు కలగనుంది.
ప్రస్తుతం యూపీ, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి కష్టాలు తప్పడం లేదు. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల్లో చమురు ధరల పెరుగుదలను విపక్షాలు ప్రధానంగా తెరపైకి తెస్తున్నాయి. దీంతో ప్రజాగ్రహం బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రో ధరల తగ్గింపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications