మొహర్రం ఊరేగింపు సమయం మార్చండి , దుర్గాపూజ కాదు : యోగి వివాదాస్పద వ్యాఖ్యలు
బరాసత్ : కోల్ కతాలో సేవ్ డెమోక్రసీ పేరుతో చేపట్టిన ర్యాలీ హింసాత్మక మారగా .. బీజేపీ, టీఎంసీ మధ్య వైరం మరింత ముదిరింది. బెంగాల్లో ప్రచారం చేస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ .. మరో అడుగు ముందుకేసి టీఎంసీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మైనారిటీలే లక్ష్యం ..
బెంగాల్ సర్కార్ మైనారిటీల లక్ష్యంతో రాజకీయం చేస్తుందని విమర్శించారు ఆదిత్యనాథ్. కుల, మతాల పేరుతో రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. దీనికి పండుగలను ఉదహరించారు. ఓకేరోజు దుర్గాపూజ, మొహరం ఊరేగింపు వస్తే పరిస్థితి ఏంటని అడిగారు. ఈ సందర్భంగా యూపీ అధికారులు తనను ఓసారి అడిగారిని తెలిపారు. అయితే దుర్గాపూజ సమయం మార్చలేమని .. మొహర్రం ఊరేగింపు రోజును మార్చొచ్చని చెప్పారు.

నో పర్మిషన్
బెంగాల్లో ఆదిత్యనాథ్ ర్యాలీలకు స్థానిక పోలీసులు అనుమతించలేదు. యోగి ప్రచారం చేస్తే ఎక్కడ బీజేపీకి మేలు జరుగుతుందోనని భయపడి పర్మిషన్ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఫుల్ బగాన్ లో యోగి సభ నిర్వహించాల్సి ఉండేది. అయితే సభ నిర్వహాకుడిపై కూడా దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ సభల్లో పాల్గొనాల్సిందిగా అమిత్ షా ఆదేశించించడంతో బెంగాల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications