మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితులపై అభియోగాలు నమోదు
2008లో మలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏ కోర్టు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురుహిత్, సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్తో పాటు మరో ఐదు మందిపై అభియోగాలు మోపింది. కేసును విచారణ చేసిన జస్టిస్ వినోద్ పదాల్కర్ నిందితులపై వచ్చిన అభియోగాలను సమర్థించారు.
మరోవైపు తమపై అభియోగాలు మోపకుండా స్టే ఇవ్వాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు నిందితులు.ఇందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో కేసును విచారణ చేస్తున్న ట్రయల్ కోర్టు వారిపై అభియోగాలు నమోదు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించింది. గతంలో విచారణ జరపరాదని దీనిపై స్టే ఇవ్వాలంటూ పురోహిత్ హైకోర్టు సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ను తోసిపుచ్చిన కోర్టులు విచారణ వేగవంతం చేయాలని విచారణ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

చట్టవిరుద్ధ చర్యలు నివారణ చట్టం కింద నిందితులపై ఉగ్రవాదం నేరాన్ని విచారణ సంస్థ నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర, హత్య కేసులను కూడా వీరిపై నమోదు చేసింది. ఒక్కసారి అభియోగాలు రికార్డు చేయబడ్డాక ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. పురోహిత్, సాధ్విలతో పాటు కేసులో మేజర్ (రిటైర్డ్) రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలపై కేసు నమోదు చేశారు. జడ్జి వీరిపై మోపిన అభియోగాలు చదువుతున్న సమయంలో వీరంతా కోర్టులోనే ఉన్నారు.
ఇక ఈ కేసు పూర్వాపరాలు చూస్తే... మహారాష్ట్రలోని మలేగావ్లో ఓ మసీదు దగ్గర పార్క్ చేసి ఉన్న మోటార్సైకిల్లో బాంబు పెట్టారు. ఇది పేలడంతో ఆరుమంది మృతి చెందగా 100 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇది సెప్టెంబర్ 29, 2008లో జరిగింది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications