శిథిలాలు: 39 గంటల తర్వాత ప్రాణాలతో ఆంధ్ర మహిళ
చెన్నై: భవనం కూలిన 39 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడింది. తమిళనాడు రాజధాని చెన్నైలో కూలిన భవనం శిథిలాల నుంచి ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరిలో ఓ మహిళ ఉంది.
చెన్నైలో 11 అంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఇంకా 40 మందిదాకా భవనం శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. శిథిలాలను తొలగించి, మరింత మందిని కాపాడడానికి రెండు మూడు రోజులు పడుతుందని అధికారులు అంటున్నారు. శనివారంనాడు సాయంత్రం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
భవనం కూలినప్పుడు అక్కడ 72 మంది కూలీలు పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ఆదివారంనాడు చెప్పారు. ఇప్పటి వరకు 22 మందిని రక్షించారు. 17 మంది మరణించారు. శిథిలాల నుంచి సోమవారం ప్రాణాలతో బయటపడిన మహిళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 35 ఏళ్ల నీనామాల్గా గుర్తించారు. ఈ భవనం నిర్మాణంలో పనిచేస్తున్న ఎక్కువ మంది కూలీలు ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రాంతానికి చెందినవారు.

పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు భవనం ప్రమోటర్స్తో పాటు ఇంజనీర్ను అరెస్టు చేశారు. అక్రమాలకు పాల్పడినట్లు, నాణ్యతభద్రతలపై రాజీ పడినట్లు వారిపై ఆరోపణలున్నాయి. నిర్మాణపరమైన లోపాలు చాలా ఉన్నట్లు, ధ్రువీకృత ప్రణాళికకు కట్టుబడి ఉన్నట్లు లేరని అనిపిస్తోందని జయలలిత అన్నారు.
చంద్రబాబు పరిశీలన
భవనం కుప్పకూలిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. ప్రమాద బాధితులను పరామర్శించిన బాబు ఈ ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక కూలీలకు సొంత రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. శిథిలాలు తొలగించడానికి ఐదారు రోజులు పట్టవచ్చునని అంటన్నట్లు ఆయన తెలిపారు. వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications