కూలిన భవనం: మరో ఇద్దరు ఆంధ్ర కూలీలు భద్రం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో 11 అంతస్థుల భవనం కూలిన సంఘటనలో మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందిన కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారంనాడు నలుగురిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారున్నారు.
మహేష్ (23), అనుసూయ (30) అనే ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు సురక్షితంగా బయటపడ్డారు. మరో వయ్క్తి తమిళనాడులోని మదురై జిల్లాకు చెందిన 27 ఏళ్ల సెంథిల్. నాలుగో వ్యక్తి ఆస్పత్రికి తరలించిన వెంటనే మరణించింది. 60 గంటల తర్వాత బయట పడిన ఆ 50 ఏళ్ల మహిళ ఆస్పత్రికి తరలించిన వెంటనే మరణించింది.

ఇప్పటి వరకు 26 మందిని సురక్షితంగా శిథిలాల నుంచి బయటకు తీసినట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య 28కి చేరుకుంది. ఇంకా 18 మంది శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న కూలీల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉత్తర భారతదేశానికి చెందినవారు.
భవన నిర్మాణంలో 72 మంది కూలీలు పనిచేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. చెన్నైలో నిర్మాణంలో ఉన్న 11 అంతస్థుల భవనం శనివారం సాయంత్రం కూప్పకూలింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications