చెన్నై వైద్యుల ఘనత: ల్యాబ్ లో చెవి డొప్పల తయారీ
చెన్నై: చెవి డొప్ప లేకుండానే పుట్టిన ఐదేళ్ళ బాలుడికి కృత్రిమ చెవిని చైనా వైద్యులు అమర్చినట్టుగానే భారత్ కూడ ఈ విషయంలో పురోగతిని సాధించిందని చెన్నై వైద్యులు మంగళవారం నాడు ప్రకటించారు.
చెవి మృదులాస్థి కణజాలాలను ప్రయోగశాలలో తయారు చేసే సత్తాను సాధించినట్టు చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీ వైద్యులు ప్రకటించారు.
త్రీడీ టెక్నాలజీ సహయంతో కణజాలాలను చెవి మాదిరిగానే పెరిగేలా తయారు చేసినట్టు చెప్పారు. గతంలో చెవిడొప్ప మార్పిడి ఆపరేషన్లలో విజయం సాధించలేదు.
కానీ, ఈ రంగంలొ కొంత విజయపథంలో సాగుతున్నట్టుగా ఎస్ఆర్ఎం యూనివర్శిటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీధర్ అభిప్రాయపడ్డారు.తమ పరిశోధనలు విజయవంతమైతే చెవి డొప్ప ఆపరేషన్లు చేపట్టనున్నట్టు వారు ప్రకటించారు.
Comments
English summary
A week after scientists in China announced that they had grown new ears for five children born with a defect in one of their ears, doctors at a Chennai hospital on Tuesday displayed an ear that they claimed to have grown in a lab.
Story first published: Wednesday, February 7, 2018, 2:27 [IST]