జైల్లో శశికళకు వందనాలు: తమిళనాడు సీఎంతో సహ మంత్రులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు!
చెన్నై: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను ప్రసన్నం చేసుకోవడానికి పాకులాడిన మంత్రులకు చుక్కెదురైయ్యింది.
న్యాయస్థానం శశికళ నేరం చేశారని గుర్తించి శిక్ష అమలు చేసిందని, అలాంటి శశికళను జైల్లో మీరు ఎందుకు కలిశారు ? అని సమాధానం చెప్పాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామితో సహ నలుగురు మంత్రులకు మద్రాసు హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ గురువారం నోటీసులు జారీ చేసింది.

తమిళనాడులో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మీరు పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలోని సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను ఎందుకు కలిశారు ? అంత అవసరం ఏమి వచ్చింది అంటూ సమాధానం చెప్పాలని ఎడప్పాడి పళనిసామితో సహ నలుగురు మంత్రులకు మదురై డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది.
ఈ దెబ్బతో సెంట్రల్ జైల్లో శశికళను కలిసిన మంత్రులు హడలిపోయారు. ఇప్పుడు న్యాయస్థానంలో ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందో ? అంటూ తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా చెన్నై నుంచి బెంగళూరు చేరుకున్న మంత్రులు పదేపదే శశికళను కలిసిన విషయం తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications