బెడ్ రూంలో ప్రియుడితో భార్యను చూసిన భర్త: చంపేశారు, ఆత్మహత్య అంటూ డ్రామా, చివరికి !
అక్రమ సంబంధంతో ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసిన భార్యను, ఆమె ప్రియుడిని తమిళనాడులోని చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై: అక్రమ సంబంధంతో ప్రియుడితో కలిసి భర్తను అంతం చేసిన భార్యను, ఆమె ప్రియుడిని తమిళనాడులోని చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడి పక్కలో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వచ్చిన భర్తను చూసి ఏమీ చెయ్యలేని మహిళ చివరికి ప్రియుడితో కలిసి భర్తను చంపేసి కటకటాలుపాలైయ్యింది.
చెన్నై నగరంలోని ఎంజీఆర్ నగర్ లోని వైశరపాడి ప్రాంతంలో శివ పెరుమాల్ (35), సావిత్రీ (28) దంపతులు నివాసం ఉంటున్నారు. శివ పెరరుమాల్ లో వ్యాపారం చేస్తున్నాడు. ఈనెల 12వ తేదీన సాయంత్రం ఆకస్మికంగా శివ పెరుమాల్ ఇంటికి చేరుకున్నాడు.

ఆ సందర్బంలో శివ పెరుమాల్ భార్య సావిత్రి తన ప్రియుడు మోహన్ తో బెడ్ రూంలో నగ్నంగా దర్శనం ఇచ్చింది. విషయం గమనించిన శివ పెరుమాల్ భార్యను గట్టిగా ప్రశ్నించాడు. ఆ సమయంలో సావిత్రి, ఆమె ప్రియుడు మోహన్ తో కలిసి శివ పెరుమాల్ ను గొంతు బిగించి హత్య చేశారు.
తన భర్త శివ పెరుమాల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సావిత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. సావిత్రి, మోహన్ అక్రమ సంబంధం వ్యవహారం తెలుసుకున్న పోలీసులు అసలు విసయం గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా శివ పెరుమాల్ ను హత్య చేశామని అంగీకరించారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications